Saturday, 28 April 2018

మే డే ను ఘనంగా జరుపుకోవాలి ; ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 28 ; కొమురంభీం జిల్లాలోని సంఘటిత, అసంఘటిత కార్మికులందరు  132 వ మే డే ఘనంగా జరుపుకోవాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. అని అన్నారు. కార్మిక హక్కులు ఏఐటీయూసీ తోనే సాధ్యం అని అన్నారు. కార్మిక హక్కుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలో పుట్టిన మొట్ట మొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ లు సాధించడంలో ఏఐటీయూసీ ఎప్పుడు ముందు ఉంటుందని అన్నారు. 1886 సవంత్సరంలో చికాగో అమరవీరుల పోరాట ఫలితంగా కార్మికులు తమ హక్కులు సాధించుకొన్నారని, అన్నారు,కానీ నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిసస్తున్నాయని, పెట్టుబడి దారులకు, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా వ్యవరిస్తున్నాయని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వాలు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని,8 గంటల పని విధానం కొనసాగించాలని, కనిసవేతనం 18000/- ఇవ్వాలని అన్నారు,కాంట్రాక్టు వ్యవస్థని పూర్తిగా రద్దు చేయాలని కోరారు కాంట్రాక్టుకార్మికులందరిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు..జిల్లాలోని కార్మికులు అందరూ సంఘటితమై  మే డే  ను విజయవంతం చేయాలని కోరారు.

No comments:

Post a Comment