Friday, 20 April 2018

టాస్క్ ఫోర్స్ దాడిలో గుడుంబా పట్టివేత

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 20 ; రెబ్బెన మండల పులికుంట గ్రామంలో గుడుంబా స్వాధీన పరుచుకున్నట్లు  టాస్క్ ఫోర్స్  సి. ఐ  రాంబాబు  తెలిపారు. గుడుంబా అమ్ముతున్నారనే ఖచ్చితమైన నిఘా  సమాచారం తో టాస్క్ ఫోర్స్  సి. ఐ  రాంబాబు నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్  లు తనిఖీ చేయగా ఎరుగటి లస్మయ్య ఇంట్లో అమ్మటానికి సిద్దంగా ఉంచిన 5 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని రెబ్బన . పోలీస్ వారికి  తదుపరి విచారణ నిమిత్తం   అప్పగించడం జరిగిందన్నరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  జిల్లా పరిధిలో  ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా నిర్భయంగా తెలియ పరచవచ్చనీ, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది అని అన్నారు.

No comments:

Post a Comment