Saturday, 14 April 2018

టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులలో దుప్పి కొమ్ములు, నకిలీ పత్తి విత్తనాలు, అక్రమ టేకు నిల్వ, మద్యం మరియు గుట్కా నిల్వ పట్టివేత

టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులలో దుప్పి కొమ్ములు, నకిలీ పత్తి విత్తనాలు, అక్రమ టేకు నిల్వ, మద్యం మరియు గుట్కా నిల్వ పట్టివేత

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) ఏప్రిల్  14 ;   ఆసిఫాబాద్ టౌన్ మరియు రెబ్బన పోలిస్ స్టేషన్ల పరిథి లో  దుప్పి కొమ్ములు, నకిలీ పత్తి విత్తనాలు, అక్రమ టేకు నిల్వ, మద్యం మరియు గుట్కా నిల్వలు ఉన్నాయి అని  ఖచ్చితమైన నిఘా  సమాచారం తో టాస్క్ ఫోర్స్  సి. ఐ  రాంబాబు నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్  గార్లు తనిఖీ చేయగా ఆసిఫాబాద్ టౌన్ లో మూడు చోట్ల పొడుపుగంటి నవీన్, తక్సడే లక్ష్మి మరియు సిరుప గోపాల్ కిరాణం షాపులలో తనిఖీ చేయగా 20,175/- విలువ గల మద్యం మరియు 10,495/- విలువ గల గుట్కా నిల్వను స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం ఆసిఫాబాద్ పోలీస్ వారికి అప్పగించటం జరిగింది.  రెబ్బన పోలీస్ స్టేషన్ పరిధిలో కొండపల్లి స్టేజ్ వద్ద సప్తే నరేష్ కిరణ షాపులో 12,880/- మద్యం మరియు 1,355/- విలువ గల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగినది. సింగిల్ గూడ గ్రామంలో అజ్మీరా బోరెలాల్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన దుప్పి కొమ్ములు మరియు 22,000/- విలువ గల 12.25 కిలోల నకిలీ పత్తి విత్తనాలు మరియు 10 ఫీట్ల అక్రమ టేకు నిల్వ  స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు  తెలిపారు.   

No comments:

Post a Comment