కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 22 ; నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి కల్పించుకోవడం సంతోషదాయకం అని అన్నారు. ఆదివారం రెబ్బెన మండల కేంద్రంలో నూతనంగా నెలకొల్పిన శివ సాయి పేపర్ ప్లేట్ ప్రొడక్ట్స్ తయారీ కేంద్రాన్ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతు పోటీ ప్రపంచంలో యువకులు ఎంతో నేర్పుతో వారి ఆలోచనలకు అనుగుణంగా ఎంచుకున్న స్వయం ఉపాధికి ప్రభుత్వ పరంగా సబ్సిడీ రుణాలను అందజేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సర్పంచ్ పేసరి వెంకటమ్మ,,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ గంధం శ్రీనివాస్,మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శెంకరమ్మ,గ్రంధాలయ ఛైర్మెన్ కనక యాదవరావు,టీబీజీకేఎస్ నాయకుడు మల్రాజ్ శ్రీనివాస్, ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, తెరాస నాయకులు సుదర్శన్ గౌడ్, గొడిసెల వెంకన్న గౌడ్, మాజీ సర్పంచ్ దుర్గం హన్మంతు, దుర్గం బరత్వాజ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment