అంగ రంగ వైభవంగా సీతా రాముల కళ్యాణం

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 26 ;రెబ్బెన మండల కేంద్రంలో సోమవారం స్థానిక సీతారామాలయంలో సీతారాముల కళ్యాణం అంగ రంగ వైభవంగా జరిగింది. రెబ్బెన మండలంలోని పలు గ్రామాలకు చెందిన భక్తులు అదిక సంఖ్యలో పాల్గొని కళ్యాణమహోత్సవాన్ని తిలకించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కళ్యాణ మహొత్సవాన్ని తిలకించిన భక్తులకు సర్వ సుఖశాంతులు కలుగుతాయని పండిత వర్యులు తెలిపారు.ముందుగా రాములవారిని దుర్గామాత ఆలయం నుండి కోలాటాల సన్నాయి,వాయిద్యాలమధ్య కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. స్వామి వారి కల్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించి . ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణ మహోత్సవానికి తహశీల్దార్ సాయన్న, నార్లపూర్ సుగుణాకర్ జంటలు, డిప్యుటు రేంజ్ ఆఫిసర్ శ్రీనివాస్ జంటలు ఈ కల్యాణంలో పల్గొన్నారు .ఈ కల్యాణోత్సవంలో ఎమ్ పి పి సంజీవ్ కుమార్, , ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, వైస్ ఎమ్ పి పి రేణుక, సర్పంచ్ పెసరి వెంకటమ్మ, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ ఆలయ కమిటి సబ్యులు రాజేశ్వర్ రావు మోడెం సుదర్శన్ గౌడ్, చెన్న సొమశెకర్, నట్రాజ్, అజయ్ జైస్వాల్, నంబాల సర్పంచ్ గజ్జెల సుశీల తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సంజీవిని సేవ సంస్థ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సహాయ సహకారాలు అందచేశారు. సాయంత్రం స్వామి వారి పల్లకి సేవ నిర్వహించారు.
No comments:
Post a Comment