కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 27 ; తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిగా రెబ్బెన మండలంలోని చెందిన కుందారం బసను ఎన్నుకోవడం జరిగిందని కొమురంభీం జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ తెలిపారు ఈ నెల ఇరవై రెండవ తేదిన పార్టీ జిల్లా రెండవ మహా సభలోతెలంగాణ రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగపశ్య పద్మ, సి పి ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూండా మల్లేష్ ల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది అన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త న మీద నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో రైతుసమస్యలపై, వారి హక్కుల కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తామని అన్నారు .
No comments:
Post a Comment