కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 22 ; సి పి ఐ (ఎం) అఖిల భారత మహాసభల సందర్భంగా హైదరాబాద్ లో ఈ నెల 25 న సెమినార్ జరగనున్నదని కొమురంభీం జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షులు కూస రాజన్నగురువారం తెలిపారు. ఈ సెమినార్ లో తెలంగాణ రాష్ట్రం మరియు ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సెమినార్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సెమినార్ లో వక్తలుగా తమ్మినేని వీరభద్రం సి పి ఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి, ప్రొఫెసర్ కే నాగేశ్వర్ ఎం ఎల్ సీ ,విజు కృష్ణన్ అఖిలభారతియా కిసాన్ సభ జాతీయ కార్యదర్శి, ఎస్ వీరయ్య, ఎడిటర్ నవ తెలంగాణ తెలుగు దినపత్రిక, డాక్టర్ రాజిరెడ్డి తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమలో అల్లూరి లోకేష్, దుర్గం దినకర్, వడ్లూరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment