కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 31 విశిష్టమైన పని తీరు తోనే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పి గోద్రు అన్నారు. శనివారం జిల్లా లోని పోలీస్ హెడ్ క్వార్టర్ సమావేశ మందిరం లో మార్చి నెల మాసంతమున పదవి విరమణ పొందిన ఏఎస్సై జాడే బాపు( ఈస్గాం పోలీస్ స్టేషన్) , హెడ్ కానిస్టేబుల్ నైతం లాలు ( ఏ ఆర్ హెడ్ క్వార్టర్) లను జిల్లా అడిషనల్ ఎస్పి పదవి విరమణ సందర్బంగా పూలమాల వేసి శాలువాతో సత్కరించి గిఫ్ట్ బాక్స్ ను అందచేశారు, పదవి విరమణచేసిన ఉద్యోగులు మాట్లాడుతూ వారి యొక్క సర్వీస్ నందు గడచిన స్మృతులను, ఎదుర్కున్న సవాళ్లను మరియు తోటి మిత్రులతో చేసిన విధులను పోలీస్ శాఖ తమకు ఇచ్చిన ఆత్మ విశ్వాసం ను మరియు సమయపాలన గురించి మాట్లాడారు. అనంతరం అడిషనల్ ఎస్పి మాట్లాడుతూ 35 సంవత్సరాల సర్వీస్ లో పోలీస్ శాఖ కు అందించిన సేవలు విశిష్టమైనవి అని వాటిని మరువలేమని అన్నారు, ఇక ముందు వారి యొక్క శేషజీవితము సుఖ సంతోషాలతో మనుమలు,మనుమరాండ్ల తో ఆనందం తో గడపాలని అభిలషించారు, పోలీస్ శాఖ తరుపున వారి యొక్క పెన్షన్ పత్రము లను వారికి అందచేశారు,ఇంకా వారికి రావాల్సిన బెనిఫిట్స్ ను వారికి త్వరలోనే అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రంలో A.O భక్త ప్రహ్లాద్, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీరాములు,ఐటి కోర్ ఇన్స్పెక్టర్ స్వామి , రిజర్వు ఇనస్పెక్టర్ యం. శ్రీనివాస్, డి.పీ.ఓ. ఉన్నత శ్రేణి సహాయకుడు కేదార సూర్యకాంత్, ఫింగర్ ప్రింట్ ఇంచార్జ్ తిరుపతి పి.ఆర్.ఓ మనోహర్ మరియు విశ్రాంత ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment