కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 21 ; కళ్యాణలక్ష్మి,షాదీ ముభారక్ సాయాన్ని రూ 75 వేల నుంచి రూ లక్ష నూట పదహరుకు పెంచి అసెంబ్లీలో ప్రకటించినందుకుగాను రెబ్బెన లో ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ మహిళలతో కలసి మిథైయులు పంచుకొని హర్షాన్ని తెలియచేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అమలుచేయని వినూత్న సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల సమయంలో హామీలను నెరవేరుస్తున్నారన్నారు. షాదీ ముబారక్ పథకాల వల్ల ఎంతో మంది ఆడపిల్లల తల్లి తండ్రులు కుల మత వివక్షలేకుండా లబ్దిపొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మన్యం అద్మా, అన్నపూర్ణ అరుణ, కాలివేణి లక్ష్మి, పిల్లి లతా, సుగుణ, పార్వతి, లక్ష్మి, రజిత తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment