కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 20 ; కొమరం భీం జిల్లా: ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి,షాదీ ముభారక్ సాయాన్ని రూ 75 వేల నుంచి రూ లక్ష నూట పదహరుకు పెంచి అసెంబ్లీలో ప్రకటించినందుకుగాను సీఎం కేసీఆర్ చిత్రపటానికి జిల్లాలోని నాయకులూ పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల సమయంలో హామీలను నెరవేరుస్తున్నారన్నారు. షాదీ ముబారక్ పథకాల వల్ల ఎంతో మంది ఆడపిల్లల తల్లి తండ్రులు కుల మత వివక్షలేకుండా లబ్దిపొందుతున్నారన్నారు. ఈ జిల్లాలోని నాయకులూ, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment