కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 25 ; ఏప్రిల్ 1 తేదీ నుండి 4 తేది వరకు హైదరాబాద్ లో జరిగే సీపీఐ 2వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ రెబ్బెన మండల కార్యదర్శి రయిల్లా నర్సయ్య అన్నారు. రెబ్బెన మండల లోని ఆర్&బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ పేద,బడుగు,బలహీన,ప్రజల హక్కుల కోసం ఎన్నో త్యాగాలు చేసింది సీపీఐ పార్టీ అని అన్నారు. రాష్ట్ర మహాసభలకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి హాజరు అవుతారని తెలిపారు, అలాగే ఎన్నికల హామీలను అమలు చేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్యాలు ఘోరంగా విఫలమైందని అన్నారు, దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని,మండలం లోని అర్హులు అయిన అందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు, రైతుల పెట్టుబడికోసం ఎకరానికి 10వేలు ఇవ్వాలని, పెండింగులో ఉన్న మరుగుదొడ్లు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు, ఈ సమావేసం లో సీపీఐ రెబ్బెన కార్యదర్శి రామడుగుల శంకర్,జిల్లా కౌన్సిల్ సభ్యులు కుందారపు బసవయ్య, నాయకులు సాగర్, సతీష్, మల్లయ్య తో పాటు తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment