Saturday, 24 March 2018

మైనారిటీ పాఠశాలలలో 9, 8 తరగతులలో ప్రవేశాలు

  కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 24 ;కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో గన్నారం  మైనారిటీ పాఠశాలలో ఈ విద్య సంవత్సరం 2018  నుండి   నుండి 9  తరగతిలోకి ప్రవేశాలు, అలాగే ఆసిఫాబాద్ మండలంలోని బాలికల మైనారిటీ పాఠశాలలో 2018  నుండి 8 వ తరగతి లోకి  ప్రవేశాలు, మొదలైనట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ సెక్రటరీ   శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇరు మండలాలలోని తల్లి తండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలలో చదివించడానికికాగజ్నగర్ లో ఎం ఎల్ ఏ  కోనేరు కోనప్ప ఏర్పాటు చేసిన ఉచిత సహాయ కేంద్రంలో తమ పిల్లల ఆధార్ కార్డు, రెండు ఫోటోలు మరియు బోనఫైడ్ లు తీసుకోని నవాజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్, ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగ, కాగజ్ నగర్ లోని కేంద్రంలో సంప్రదించగలరని అన్నారు. 

No comments:

Post a Comment