Wednesday, 21 March 2018

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యునిగా దుర్గం రవీందర్


కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 21 ; భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా కార్యవర్గ సభ్యునిగా గోలేటి గ్రామానికి చెందిన దుర్గం రవీందర్ ను ఎన్నుకోవడం జరిగిందని సిపిఐ మాజీ శాసనసభ్యులు గుండా మల్లేష్ తెలిపారు. మంగళవారం ఆసిఫాబాద్ లో జరిగిన సిపిఐ జిల్లా మహసభలో ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. రవీందర్ ఇప్పటికే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా విద్యారంగ సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్నడని అంతేకాకుండా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజా సమస్యలు పరిష్కారానికై పోరాటాలు నిర్వహిస్తున్నడని అన్నారు. రవీందర్ మాట్లాడుతూ విద్యార్థి, యువజన, ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పోరాటాలు చేస్తానని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తానని అన్నారు. తనపై నమ్మకంతో పార్టీ కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకున్నందుకు  రాష్ట్ర,జిల్లా పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 

No comments:

Post a Comment