కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 26 ; ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని తహశీల్దార్ సాయన్నఅన్నారు. సోమవారం రెబ్బెన తహశీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడరు. మండలంలోని లేతన్ గూడా మరియూ గొల్లగూడ పరిసర ప్రాంతాల్లో డంప్ చేసిన సుమారు పద్దెనిమిది ట్రాక్టర్ల ఇసుక కుప్పలను పోలీసుల సమాచారం మేరకు సీజ్ చేసినట్లు తెలిపారు సీజ్ చేసిన ఇసుకను త్వరలోనే వేలం పాట నిర్వహిస్తామన్నారు ట్రాక్టర్ యజమానులు అనుమతి తీసుకున్న ప్రాంతం నుండే ఇసుకను తరలించాలని ఇసుకను పక్కదారి పట్టించి ఇసుకను అక్రమంగా నిల్వ చేసిన కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తూ రెండుసార్లు పట్టుబడిన జరిమానా విధించడం జరుగుతుందన్నారు ఆపై అక్రమ రవాణా తప్పిన ట్రాక్టర్లను సీజ్ చేసి యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
No comments:
Post a Comment