Monday, 19 March 2018

షాదిముబారక్, కల్యాణలక్మి పథకం సాయం పెంపు



కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 19 ;  ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి ఔదార్యతను  చాటుకున్నారని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తెరాస  మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమూద్ అన్నారు. సోమవారం ఆసిఫాబాద్లో ఏర్పాటుచేసిన సమావేశంలో  ఇటీవల తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్  ఆదేశాలతో కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకంలో ఇస్తున్న 75,000 రూపాయలను 1,00,116 కు పెంచడంజరిగిందని ఈ పథకంవల్ల పేదింటి ఆడపిల్లలకు చాల మేలు జరుగుతున్నదని అన్నారు. దేశంలోనే మొదటిసారిగా కుల,మత  వివక్షలేకుండా ప్రతి పేదింటి ఆడపిల్లలకు పెళ్లి సమయంలో ఈ పథకాలవల్ల మేలు జరుగుతుందన్నారు.

No comments:

Post a Comment