కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 22 ; అక్రమంగా ఇసుక తరలిస్తున్న నెంబర్ ఏపీ01ఎక్స్ 2979 గల లారీని గురువారం రెబ్బెన పోలీసులు లేతన్ గూడా రైల్వే గేట్ వద్దనుండి ఆదిలాబాద్ కు వెళ్లే ప్రధాన రహదారిపై పక్కా సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నట్లు రెబ్బెన ఎస్సై శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా లారీ డ్రైవర్ ఎస్ కే జమీల్ ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. తగిన పత్రాలు లేకుండా ఇసుకను రవాణా చేయకుడదని ఎస్సై అన్నారు.
No comments:
Post a Comment