కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 28 ; రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాల నందు అదనపు తరగతి గదిని బుధవారం జడ్పీటీసీ అజమీర బాపు రావు, ఎంపిపి కర్నాధం సంజీవ్ కుమార్ లు ప్రారంభించారు.ఏ సందర్భంగా పాఠశాలా నిర్వహణపై ఏర్పాటు చేసిన ఫోటో ఎక్సిబిషన్ ను తిలకించారు. విద్యార్థిని విద్యార్థులను సౌకర్యాలపై అది తెలుసుకున్నారు. పాఠశాలా అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మ, పాఠశాలా ప్రధానోపాధ్యాయులు రవి కుమార్, సి ఆర్ పి దేవేందర్, ఉపాధ్యాయులు సదానందం, అశోక్, కవిత, జంగ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment