కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 31 నిర్దేశించిన లక్ష్యానికి మించి 102 శాతం ఉత్పత్తి సాధించినట్టు బెల్లంపల్లి ఏరియా సింగరేణి జెనరల్ మేనేజర్ రవిశెంకర్ తెలిపారు. శెనివారం రెబ్బెన మండలం గోలేటి జియం కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడారు. బొగ్గు ఉత్పత్తి సాధనలో బెల్లంపల్లి ఏరియా సింగరేణి 2017-2018 సంవత్సరానికి గాను ఉత్పత్తి వివరాలను తెలిపారు. 70 లక్షల టన్నుల ఉత్పత్తి కి గాను 71.3233 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించినట్టు తెలిపారు 102 శాతం ఉత్పత్తి సాధించినట్టు తెలిపారు. మార్చ్ నెలకు గాను కైరుగూడ ఓసీ 3.33,000 వేల టన్నుల లక్ష్యం కాగా 3,41,915 టన్నుల ఉత్పత్తి సాధించినట్టు పేర్కొన్నారు. ఓసీ 2,1, 000 టన్నులకు గాను 93, 478 టన్నుల ఉత్పత్తి 78 శాతం జరిగిందన్నారు. డోర్లి1, 2 లక్షల 30 వేల టన్నులకు గాను 2 లక్షల 30 వేళా 576 టన్నులు.100 శాతం ఉత్పత్తి జరిగినట్టు తెలిపారు. ఉత్పత్తి సాధనకు కృషి చేసిన కార్మికులకు అభినందనలు తెలిపారు. కార్మికుల సమిష్టి కృషితోనే 102 శాతం ఉత్పత్తి సాధ్యమైనట్టు తెలిపారు, ఈ ఏడాది 92 కోట్లతో నిర్మించిన సీఎస్పీ ప్రారంభమైనట్లు తెలిపారు.13వ తేది నుండి వేణుగోపాల్ మెమొరియల్ ఫుట్ బాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశం లో ఎస్ఓటు జియం శ్రీనివాస్ ,డిజిఎం పర్సనల్ జె కిరణ్ ,ఐఈటి యోహాన్,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment