కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 30 ; రెబ్బెన మండలంలోని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రిలో గుడ్ఫ్రైడే సందర్భంగా శుక్రవారం సంజీవని సేవా సంస్థ ఆధ్వర్యములో రోగులకు పండ్లను పంపిణీ చేశారు . ఈ సందర్భంగా సంజీవని స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు దీకొండ సంజీవకుమార్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఈ సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. స్వచ్చ్చంద సంస్థ తరపున భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతామన్నారు. మండలంలోనే కాకుండా జిల్లాలోనే మరెన్నో సేవా కార్యక్రమాలకు ముందుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రి స్టాప్ నర్సు భాగ్యలక్ష్మి, హోమియో వైద్యురాలు సరిత మరియు సంజీవని స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కొల్లి సునీల్ కుమార్, పర్వతి సాయికుమార్, దీకొండ సాయితేజ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment