Thursday, 12 January 2017

షీటీంల పై అవగాహన సదస్సు

  షీటీంల పై అవగాహన సదస్సు


కుమురం బీమ్ ఆసిఫాబాద్  ( వుదయం ప్రతినిధి) జనవరి 12 ;  కుమురం బీమ్ ఆసిఫాబాద్  ( వుదయం ప్రతినిధి) జనవరి 12 ;   రెబ్బెన మండలం లోని కొండపల్లి గ్రామంలో ఎన్ ఎస్ ఎస్ క్యాంపులో  రెబ్బెన పోలీస్ సర్కిల్  అద్వర్యం లో షీ టీం ల పై సి ఐ మదన్ లాల్  అవగాహనా కల్పించారు.ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ అభ్యున్నతి,స్వేచ్ఛ గ రోడ్ల పై తిరిగే రోజులు కల్పించే దిశగా కృషి చేస్తుందని అందుకు ప్రతి ఒక్కరు దీనికి సహకరించగలరని కోరారు.మహిళా పై నిత్యం జరుగుతున్న దాడులు,అఘాయిత్యాలను అరికట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా షీ  టీంలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. స్త్రీ లను రక్షించడమే షీ టీంల పని అని అన్నారు. స్త్రీల  పట్ల అసభ్యంగా ప్రవర్తించిన,దుర్బాషలాడిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.అమ్మాయిలను, మహిళలను కించపరిచే ఆకతాయిలను పట్టుకునేందుకు డివిజన్ స్థాయిలో ఒక షీ టీం మఫ్టీ  లో  నిరంతరం పర్యవేక్షణలో ఉంటారని అన్నారు.మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్న,వేధింపులకు గురిఅవుతున్న పోలీస్ జిల్లా శాఖ చరవాణి నెంబర్ 7995800776, 100 కి కాల్ చేస్తే  వెంటనే సంబంధిత సిబ్బంది స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటారని అన్నారు.  జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలఅనుసారం అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరిణని  చైతన్యవంతులను చేస్తున్నామని అన్నారు. యువత పెడదారిని వదిలి బంగారు భవిష్యత్తుకు కళాశాల సమయంలోనే పునాదులు వేసుకోవాలని సూచించారు. ఆయనతో పాటు రెబ్బెన ఎస్ ఐ దారం సురేష్, షీ టీం బృందం వాని శ్రీ, కోమల,పొలిసు సిబ్బంది ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment