రక్షణతో కూడిన ఉత్పత్తి చేయాలి
కన్వీనర్ కె నారాయణ
కొమురం భీం అసిఫాబాద్ వూదయం జనవరి 17: వృత్తి పరంగా రక్షణ చర్యలు తీసుకోవడమే కాకుండా స్వీయ రక్షణ పై అవగాహన కల్గివుండాలని వారోత్సవాల తనిఖీ బృందం కన్వీనర్ కె నారాయణ అన్నారు . 49 వ వారోత్సవాల సందర్బంగా బెల్లంపల్లి ఏరియా లోని డోర్లి 1 ఓసిపి గనిని తనిఖీ చేశారు . కంపెనీ నిర్దేశించిన లక్ష్యాన్ని 3 నెలల 22 రోజులలలో సాధించడం గర్వకారణమని అన్నారు . జీఎం రవిశంకర్ మాట్లాడుతూ ప్రమాదాలు మానవ తప్పిదాల వలన జరుగుతాయని , ప్రమాదాలు జరగకుండా పనిలో నిపుణ్యతను పెంచుకోవాలని అన్నారు . కమ్యూనికేషన్ సెల్ కో ఆర్డినేటర్ పాడిన పాటలు , ఆడిన ఆటలు అందరిని అబ్బుర పరచాయి . గాని కి చేరుకున్న తనిఖీ బృందాన్ని దొర్లి ఓసిపి అధికారులు సాంప్రదాయ గుస్సాడీ నృత్యాలతో సాధారణంగా ఆహ్వానించారు .
No comments:
Post a Comment