Wednesday, 18 January 2017

21వ వర్దంతి పురస్కరించుకొని యన్ టీ ఆర్ విగ్రహానికి పాలాభిషేకం

 21వ వర్దంతి పురస్కరించుకొని యన్ టీ ఆర్ విగ్రహానికి  పాలాభిషేకం

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 18 ; రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల తే.దె.పా. ఆద్వైర్యంలో18 తేది సోమవారం రోజున స్వర్గీయ యన్ టీ ఆర్ 21 వ వర్దంతి పురస్కరించుకొని రెబ్బెన న  మండల  కేంద్రంలో మండల తే.దె.పా ఆద్వైర్యంలో ఎం టి ఆర్ విగ్రహానికి ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జి రితేష్  రాథోడ్ పాలాభిషేకం చేసి , పూలమాలలు వేశారు.   అనంతరం పండ్ల పంపిణి చేశారు , ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలుగు దేశం పాత్రి హయాంలో తెలంగాణా ప్రాంతం ఎంతో అభివృద్ధి జరిగిందని అన్నారు .బిసి ఎస్సి ఎస్టీ  మైనారిటీ లకు హక్కుల సాధనలో ఎంతో కృషి జరిగిందని, ఎం టి ఆర్   వారి కాస్త సుఖాలలో పాలు పంచుకున్నారని తెలిపారు .తెలుగు దేశం పేదల పార్టీ , రాబోయే రోజుల్లో టిడిపి  జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు .   జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లులక్ష్మి మాట్లాడుతూ రెబ్బెన మండలములో టిడిపి హయాంలో అభివృద్ధి జరిగిందని , రోడ్లు , త్రాగు నీరు మండలానికి ఒక్క కళాశాల మంజూరు చేయించింది టిడిపి పార్టియేయని ఆమె పేర్కొన్నారు . ఈ కార్యక్రమములో మండల అధ్యక్షుడు సంగం శ్రీనివాస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు అజమేరా రమేష్ , ప్రధాన కార్యదర్శి అజయ్ జైస్వాల్ , నాయకులూ నవీన్ , వేంకటేశ , బొడ్డు విజయ , అనసూర్య, రాము , సంతోష్ ,విజయ్, అన్నాజీ తదితరురులు ఉన్నారు .

No comments:

Post a Comment