మహాధర్నా ను విజయవంతం చేయండి; ఎఐఎస్ఏఫ్
కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) జనవరి 30 ; కుమురం బీమ్ (వుదయం ప్రతినిధి)రెబ్బెన; రాష్ట్రంలో విద్యా,వైద్యం,ఉపాధి హక్కుల సాధనకై ఎఐఎస్ఏఫ్,ఎఐవైఏఫ్ ఆద్వర్యంలో ఫిబ్రవరి 2 నాడు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించడం జరుగుతుందని జిల్లాలోని యువకులు,విద్యార్థులు,కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్ అన్నారు.రెబ్బెన మండల కేంద్రంలోని రోడ్లు మరియు భవనాలు విశ్రాంతి ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో బి.జె.పి. ప్రభుత్వం, రాష్ట్రంలో టి.ఆర్. ఎస్.ప్రభుత్వం వచ్చిన తరువాత అనేక సమస్యలు విద్యార్థి, యువజనులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి నిధులు కేటాయించకుండా విద్యారంగంలో మత పరమైన విధానాలకు అనుకూలంగా మత విద్యను పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టేందుకు సంస్కరణలకు ప్రయత్నాలు మొదలు పెట్టిందని అన్నారు. రాష్ట్రంలో కె.జి. టూ పి.జీ. ఉచిత విద్యా విధానం అమలు చేయాలని,వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రియంబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని, కాంట్రాక్టు రంగంలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, యస్.సి.,యస్.టి.,బి.సి.కార్పొరేషన్ లో దరఖాస్తు చేసుకున్నవారందరికి ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మంజూరు చేయాలని తదితర డిమాండ్ లతో మహాధర్నా నిర్వహించడం జరుగుతుందని మహాధర్నాను జయప్రదం చేయుటకు విద్యార్థులు,యువజనులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ మండల కార్యదర్శి పర్వతి సాయికుమార్, గోలేటి పట్టన అధ్యక్షులు పడాల సంపత్,నంబాల అధ్యక్షుడు పూదరి హరీష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment