Tuesday, 3 January 2017

సావిత్రి బాయి పూలె జయంతిని అధికారికంగా జరపాలి ; ఏ ఐ ఎస్ ఎఫ్

సావిత్రి బాయి పూలె జయంతిని అధికారికంగా జరపాలి ;  ఏ ఐ ఎస్ ఎఫ్  

కొమురం బీమ్  (రెబ్బెన వుదయం ప్రతినిధి) సావిత్రి బాయి పూలె స్వేచ్ఛకు గుర్తని, ఒక సేవకు ప్రతి రూపం అని, ఆత్మవిశ్వసపు సంచలనామ్ అని ఏ ఐ ఎస్ ఏఫ్  జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం  రవీందర్ అన్నారు. తరతరాల అవమానాలు, వెనకకు నెట్టిన కులాలు, చదువుకు దూరం చేసి, మూఢ నమ్మకాలలో నిండాముంచి, స్త్రీని ఆటవస్తువుగా చుసిన నా దేశములో, స్త్రీని మనిషిగా చూసేలా తీర్చిదిద్దిన మూఢత్వమే రాజ్యముగా  ఉన్న దేశంలో వెలుతురు చుపే దారిగా వచ్చిన ఉపాధ్యాయురాలిని సావిత్రి బాయి పూలె అని అన్నారు. సావిత్రి బాయి పూలె 186వ జయంతి సందర్బంగా రెబ్బెన మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూలమాల వేసి నివలులు అర్పించారు. విద్యతోనే అసమానతలు తోలిగి పోతాయని, విద్యతోనే విప్లవాత్మక మార్పులు వస్తాయని, విద్యావ్యాప్తికి కృషి చేస్తూ అగ్ర వర్ణాల అధిపత్యాని, సాంఘిక దురాచారాలను నిరసించి ఉద్ద్యమాన్ని చేసి మహిళలకు విద్యను బోధించింది సావిత్రి బాయి  పూలె అని అన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వితంతు వివాహల ప్రోత్సాహం, అనాధ బాలాలదత్తాత వంటి సామజిక కార్యక్రమాలను ప్రోత్సహించి అనేక మందిలో చైతన్యం కలిగించింది సావిత్రి బాయి పూలె అని అన్నారు. అడా పిల్లలను వంటింటికే పరిమితం చేసే విధానాలను వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఎన్నో అవమానాలను సైతం ఎదుర్కున్న గొప్ప ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలె అని అన్నారు. సావిత్రి బాయి  పూలెని విద్యార్థులు ఆదర్శనంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్  నాయకులూ పార్వతి సాయి, కార్తీక్,మనీషా,సౌమ్య తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment