Saturday, 29 August 2015

ఘనంగా మన గుడి కార్యాక్రమం

ఘనంగా మన గుడి కార్యాక్రమం


రెబ్బెన మండల కేంద్రంలోని సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం రాఖి పౌర్ణమి సందర్భంగా  మన గుడి కార్యక్రమం కమిటి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన కంకణాలు ,ప్రసాదం , కుంకుమార్చన పూజాసామాగ్రిని భక్తులకుఅందజేశారు. అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలను నాటారు. ఈకార్యక్రమంలో కమిటి మెంబర్లు సుదర్శన్‌ గౌడ్‌, నవీన్ జైశ్వాల్,బొమ్మినేని శ్రీధర్‌, శంకరమ్మ , సోమశేఖర్‌, సర్పంచులు , వెంకటమ్మ, ముంజం రవీందర్‌, నాయకులు హన్మంతు, దుర్గారావ్‌, సర్వేశ్వర్‌ గౌడ్‌ , వార్డు మెంబర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment