రెబ్బెన : మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం 1,200 యూరియా బస్తాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ గాజుల రవీందర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ చేస్తున్నామన్నారు. 20-20 ఎరువులు కూడా రైతులకు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఇఓ మార్క్, సీఇఓ సంతోష్, అసిస్టెంట్ తిరుపతి పాల్గొన్నారు.
No comments:
Post a Comment