Wednesday, 12 August 2015

మహాసభల గోడ ప్రతుల విడుదల


రెబ్బెన మండలంలోని గోలేటిలో బుధవారం నాడు ఏ,ఐ,టీ,యు,సి నాయకులు మహేంద్ర భవనంలో ఈనెల 16న కొత్తగుడెంలో జరిగే తెలంగాణా రాష్ట్ర మొదటి మహాసభల గోడ ప్రతులు విడుదల చేశారు,ఏ,ఐ,టీ,యు,సి బ్రాంచ్ సెక్రెటరీ బోగే ఉపెంధర్ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం  కాంట్రాక్ట్ కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ శ్రమ దోపిడి చేస్తున్నారని అన్నారు, ఈ సభలో భవిషత్ కార్యచరణ రూపొందించి తీర్మానం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు , ఏరియా లోని కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలనీ కోరారు, ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు రామస్వామి కార్యదర్శి సీఎచ్ అశోక్, సహాయ కార్యదర్శి మొగిలి,నాయకులు వెంకన్న,సుధాకర్, రమేష్,శేఖర్,రాజ్ కుమార్,తదితర నాయకులు పాల్గొన్నారు

No comments:

Post a Comment