Thursday, 6 August 2015

తహశీల్దార్ కార్యాలయం లో జయశంకర్ 81వ జయంతి వేడుకలు


ప్రొఫెసెర్. ఆచార్య కొతపల్లి .జయశంకర్‌ 81వ  జయంతి సందర్భంగా గురువారం రోజున రెబ్బెన మండలం లోని అన్ని కార్యాలయాలలో నివాళులు అర్పించారు.  తహశీల్దార్ కార్యాలయంలో   జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ప్రొ. జయశంకర్‌  కలలుగన్న తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని రెబ్బెన మండల తహశీల్దార్  పేర్కొన్నారు తహశీల్దార్ రమేష్ గౌడ్  ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన  మాట్లాడుతూ జయశంకర్‌ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలన్నారు. ఇదే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అనిఅన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యుటీ తహశీల్దార్ రామ్మోహనరావు , అర్ ఐ. అశోక్, సీనియర్ అసిస్టెంట్ శంకర్ , కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment