Friday, 28 August 2015

భూ నిర్వాసితులకు అండగా సింగరేణి -జి .యం రవి శంకర్

బెల్లంపల్లి ఏరియా గోలేటి జీ,యం రవి శంకర్ శుక్రవారం నాడు కేస్లాపూర్ లోని భూ నిర్వాసితుల  పునరావాస కేంద్రంలో కమిటీ  నూతన పాటశాల భవనానికి కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేశారు. అనంతరం సింగరేణి సంస్థలోభూములు కోల్పోయిన భూ నిర్వాసితుల సమస్యలపై చర్చించారు ఈ సమావేశంలో జీ,యం రవి శంకర్ మాట్లాడుతూ సింగరేణిలో భూములు కోల్పోయిన వారికీ భూ పట్టాలను అందజేస్తామని అన్నారు. వాటర్ ట్యాంక్ నిర్మించి ఇంటింటా నీటి సదుపాయం కల్పిస్తామని, నిరుద్యోగ యువత ఒక సంఘంగా ఏర్పడితే  అర్హులైన వారికి కాంట్రాక్ట్  పనులను పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డి.  జి,యం  చితరంజన్, డి,జి,యం(సివిల్) రామకృష్ణ, టి,జి,బీ,కే,యస్ కార్యదర్శి యన్,సదాశివ్ఏ,ఐ,టీ,యు,సీ,కార్యదర్శి యస్,తిరుపతి, ప్రాజెక్ట్ అధికారి సంజీవ్ రెడ్డి , డి,వై,పి,యం రాజేశ్వర్ రావు, కార్యాలయ సిబ్బంది, తదితరులు  పాల్గొన్నారు

No comments:

Post a Comment