కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 30 ; ప్రజా ఫిర్యాదులలో వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజల నుండి దరఖాస్తులను సమావేశ మందిరంలో స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి అర్జీదారులకు న్యాయం చేయాలన్నారు వివిధ రకాల సమస్యలపై అర్జీలు యాభై ఆరు వచ్చాయన్నారు అందులో గోలేటి చెందిన నర్సయ్య రెండేళ్ల నుండి పెన్షన్ రావట్లేదని , కాగజ్ నగర్ నుండి ప్రవీణ్ కుమార్ తనకు విద్యుత్ షాక్ తో చేయి కోల్పోయానని నష్టపరిహారం ఇప్పించాలని, దానాపూర్ గ్రామస్థులు కరెంట్ సౌకర్యం కల్పించాలని, రాజంపేటకు చెందిన మూర్తి తనకు స్థలం ఇప్పించమని, ఎల్లంపల్లి, పెంచికలపేట గ్రామస్తులు తాగునీటి సౌకర్యం కల్పించాలని జనకాపూర్కు చెందిన సంగీత డబుల్ బెడ్ రూమ్ ఇంటి కొరకు, జనకాపూర్కు చెందిన పుష్ప తనకు భూమి ఇచ్చారు కానీ స్థలం చూపించడం లేదని తదితర దరఖాస్తులను పాలనాధికారి కి సమర్పించారు ఈ సమావేశాల్లో సంయుక్త పాలనాధికారి బి అశోక్ కుమార్, డిఆర్ఓ కంద సురేష్, డిఆర్డిఎ పిడి వెంకటి, సిపిఓ కృష్ణయ్య మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Monday, 30 April 2018
కార్మికులకు మజ్జిగ మరియు ఓఆర్ఎస్ పాకెట్స్ అందచేయాలి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 30 ; కాంట్రాక్ట్ కార్మికులకు పని వేళలు మారుస్తూ ఎండవేడికి ఉపశమనం కోసం మజ్జిగ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్ల అందజేయాలని ఏఐటీయూసీ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ ఉప అధ్యక్షుడు బోగే ఉపేందర్ సోమవారం ఎస్వోటూ జీఎం శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం ఎండాకాలంలో ఎండతీవ్రత రోజురోజుకు పెరుగుతుండడంతో కార్మికులు పని చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందని వారి కోసం పనివేళలను మారుస్తూ మజ్జిగ ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని అన్నారు . ఈ కార్యక్రమంలో సాగర్ గౌడ్, రామ్ కుమార్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్ నెలలో బెల్లంపల్లి ఏరియా 92 శాతం బొగ్గు ఉత్పత్తి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 30 ; బెల్లంపల్లి ఏరియాలో ఏప్రిల్ నెలకు గాను తొంభై మూడు శాతం ఉత్పత్తిని సాధించినట్టు ఏరియా ఇంచార్జి జనరల్ మేనేజర్ కొండయ్య తెలిపారు. సోమవారం రెబ్బెన మండలం గోలేటి జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అయన ఉత్పత్తి వివరాలను తెలిపారు. ఏప్రిల్ నెలకు గాను. ఏరియాకు నిర్దేశించి నిన 6,10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను,5,61,857 టన్నుల ఉత్పత్తి తో 92 శాతం సాధించినట్టు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థ 70మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా బెల్లంపల్లి ఏరియాకు 70లక్షల టన్నుల లక్ష్యాన్ని ఏర్పాటుచేసిందన్నారు. సంస్థ వార్షిక లక్ష్యంలో బెల్లంపల్లి ఏరియా 10 శాతం ఉత్పత్తిని సాధించాల్సి ఉంటుందన్నారు.ఏప్రిల్ నెలలో ఖైరిగూడ ఓసిపి 2,58,688 టన్నులు, బెల్లంపల్లి ఒసిపి 2 ఎక్స్టెన్షన్ 1,02,531 టన్నులు,డోర్లి -1ఓసిపి 2,00638,టన్నుల ఉత్పత్తి సాధించినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ తో పోలిస్తే ఈసారి రెండు శాతం ఉత్పత్తి తగ్గినట్లు తెలిపారు.అదేవిదంగా 17 శాతం బొగ్గు డిస్ ప్యాచ్లు తగ్గినట్లు తెలిపారు.ఏప్రిల్ నెలలో 190 ర్యాక్స్ బొగ్గును సరఫరా చేశామన్నారు. ఇటీవలే గోలేటి సి హెచ్ పి పూర్తి స్థాయి ప్రారంభం కావడంతో మరింత ఎక్కువ బొగ్గు సరఫరా సాధిస్తామన్నారు. వినియోగదారులకు 100 శాతం సరఫరా లక్షంగా పని చేస్తామన్నారు. ఉత్పత్తికి అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. గడిచిన నెలలో ఏర్పడిన ఉత్పత్తి లోటును వచ్చే నెలలో అధిగమిస్తామన్నారు. టెక్నీషన్లు, ఫిట్టర్లు కొరత కొంత ఇబ్బందులకు గురిచేస్తుంది అన్నారు. మే నెలకు గాను వార్షిక లక్ష్యాన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అదేవిదంగా కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు,చల్లని నీటి సౌకర్యాన్ని అందుబాటులో ఉంచామన్నారు ఈ సమావేశంలో ఎస్వోటూ జీఎం శ్రీనివాస్, డిజిఎం పర్సనల్ కిరణ్ ,డీవైపీఎం రాజేశ్వర్, ఐఈడీ ఎస్ ఈ యోహాన్ తదితులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ లో జాబ్ మేళా
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 30 ; కొమురంభీం జిల్లా కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం లో నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళాను సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూర్ మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆసీఫాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. జాబ్ మేళాలో సుమారు 80 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఐటీడీఏ జేడీఎం నాగభూషణం మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నామని మరియు నెలకు తొమ్మిది వేల నుంచి పదివేల జీతం మరియు ఉచిత భోజనం తో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని నిరుద్యోగ యువకులు ఈ ఉద్యోగాల్లో చేరి తమ భవిష్యత్తును బంగారు మయం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డిఆర్డిఓ వెంకట్ , డిపిఎం అన్నాజీ మరియు క్యాంపస్ గ్రూప్ హెచ ఆర్ మధుసూదన్, ప్రీమియం హోంకేర్ హెచ్ఆర్ వసంత్ మరియు ఏపీ ఫెటలిస్ హెచ్చార్ మహేందర్, ఐకేపీ సిబ్బంది సిసిలు పాల్గొన్నారు పాల్గొన్నారు.
Sunday, 29 April 2018
హమాలీల న్యాయమైన హక్కుల సాధన కోసమే సమ్మె ; ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్
Saturday, 28 April 2018
మే డే ను ఘనంగా జరుపుకోవాలి ; ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్
రహదారి భద్రతను జీవిత పాఠ్యాంశంగా చేర్చాలి : జనరల్ మేనేజర్ రవిశంకర్ - మద్యం తాగి వాహనాలు నడపొద్దు ఉమామహేశ్వరరావు ఎంవీఐ
కొమురంభీం జిల్లా కేంద్రంలో కార్డాన్ సెర్చ్

ఉద్యోగ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి: తెలంగాణ జన సమితి జిల్లా సమన్వయకర్త లావుడ్య ప్రేమకుమార్
Friday, 27 April 2018
బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు
Thursday, 26 April 2018
టాస్క్ ఫోర్స్ తనిఖీలలో సుమారు 5,00,000/- విలువ చేసే మద్యం స్వాధీనం
రెబ్బెన మండలంలో నకిలీ పత్తి విత్తనాలపై విస్తృత తనిఖీలు ; ఇద్దరిపై కేసు నమోదు
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి ; ఎస్ వొ టూ జీఎం శ్రీనివాస్

కనకదుర్గ దేవి జాతర గోడ ప్రతుల విడుదల


చేపల పెంపకం కై చెరువు అభివృద్ధి పనులు ప్రారంభం
Wednesday, 25 April 2018
మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయాలి ; చీఫ్ ఇంజనీర్ జగన్మోహాన్ రెడ్డి
సమ్మర్ కోచింగ్ క్యాంప్.
టాస్క్ ఫోర్స్ సంచలన దాడిలో మద్యం, కలప మరియు గుట్కా నిల్వ పట్టివేత

రైలు కిందపడి వ్యక్తి మృతి
Tuesday, 24 April 2018
చికిత్స పొందుతున్న మహిళ మృతి
పురుగుల మందు సేవించి రైతు మృతి ; రైతును మింగిన అప్పులు
ప్రభుత్వ ఆస్పత్రిలో అల్ఫాహారం పంపిణీ

టాస్క్ ఫోర్స్ దాడిలో రవాణాకు సిద్దంగా ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

టాస్క్ ఫోర్స్ మెరుపు దాడిలో మద్యం మరియు బెల్లం నిల్వ పట్టివేత
Monday, 23 April 2018
అగ్ని ప్రమాదంలో మహిళకు గాయాలు
గిరిజన మండలాలలో పర్యటించిన బీజేపీ బృందం ;
కేంద్రప్రభుత్వ పథకాల అమలు తీరు పై కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ సమీక్ష

Sunday, 22 April 2018
స్వయం ఉపాధి కల్పించుకోవడం సంతోషదాయకం ; ఎమ్మెల్యే కోవా లక్ష్మి
యువత మంచి లక్షణాలు అలవర్చుకోవాలి ; ఎమ్మెల్యే కోవలక్ష్మి
బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలి వేంద్రం ఏర్పాటు
Saturday, 21 April 2018
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: టాస్క్ ఫోర్స్ సి ఐ రాంబాబు
Friday, 20 April 2018
ప్రధానమంత్రి ఉజ్వల్ అభియాన్ పథకంలో వంట గ్యాస్ పంపిణి

పాలీసెట్ కు ఏర్పాట్లు పూర్తి
బెల్లంపల్లి ఏరియాకు బంగారు భవిష్యత్తు ఉంది : ప్లానింగ్ డైరెక్టర్ భాస్కర్ రావు
