కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 30 ; ప్రజా ఫిర్యాదులలో వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజల నుండి దరఖాస్తులను సమావేశ మందిరంలో స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి అర్జీదారులకు న్యాయం చేయాలన్నారు వివిధ రకాల సమస్యలపై అర్జీలు యాభై ఆరు వచ్చాయన్నారు అందులో గోలేటి చెందిన నర్సయ్య రెండేళ్ల నుండి పెన్షన్ రావట్లేదని , కాగజ్ నగర్ నుండి ప్రవీణ్ కుమార్ తనకు విద్యుత్ షాక్ తో చేయి కోల్పోయానని నష్టపరిహారం ఇప్పించాలని, దానాపూర్ గ్రామస్థులు కరెంట్ సౌకర్యం కల్పించాలని, రాజంపేటకు చెందిన మూర్తి తనకు స్థలం ఇప్పించమని, ఎల్లంపల్లి, పెంచికలపేట గ్రామస్తులు తాగునీటి సౌకర్యం కల్పించాలని జనకాపూర్కు చెందిన సంగీత డబుల్ బెడ్ రూమ్ ఇంటి కొరకు, జనకాపూర్కు చెందిన పుష్ప తనకు భూమి ఇచ్చారు కానీ స్థలం చూపించడం లేదని తదితర దరఖాస్తులను పాలనాధికారి కి సమర్పించారు ఈ సమావేశాల్లో సంయుక్త పాలనాధికారి బి అశోక్ కుమార్, డిఆర్ఓ కంద సురేష్, డిఆర్డిఎ పిడి వెంకటి, సిపిఓ కృష్ణయ్య మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Monday, 30 April 2018
కార్మికులకు మజ్జిగ మరియు ఓఆర్ఎస్ పాకెట్స్ అందచేయాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 30 ; కాంట్రాక్ట్ కార్మికులకు పని వేళలు మారుస్తూ ఎండవేడికి ఉపశమనం కోసం మజ్జిగ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్ల అందజేయాలని ఏఐటీయూసీ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ ఉప అధ్యక్షుడు బోగే ఉపేందర్ సోమవారం ఎస్వోటూ జీఎం శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం ఎండాకాలంలో ఎండతీవ్రత రోజురోజుకు పెరుగుతుండడంతో కార్మికులు పని చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందని వారి కోసం పనివేళలను మారుస్తూ మజ్జిగ ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని అన్నారు . ఈ కార్యక్రమంలో సాగర్ గౌడ్, రామ్ కుమార్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్ నెలలో బెల్లంపల్లి ఏరియా 92 శాతం బొగ్గు ఉత్పత్తి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 30 ; బెల్లంపల్లి ఏరియాలో ఏప్రిల్ నెలకు గాను తొంభై మూడు శాతం ఉత్పత్తిని సాధించినట్టు ఏరియా ఇంచార్జి జనరల్ మేనేజర్ కొండయ్య తెలిపారు. సోమవారం రెబ్బెన మండలం గోలేటి జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అయన ఉత్పత్తి వివరాలను తెలిపారు. ఏప్రిల్ నెలకు గాను. ఏరియాకు నిర్దేశించి నిన 6,10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను,5,61,857 టన్నుల ఉత్పత్తి తో 92 శాతం సాధించినట్టు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థ 70మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా బెల్లంపల్లి ఏరియాకు 70లక్షల టన్నుల లక్ష్యాన్ని ఏర్పాటుచేసిందన్నారు. సంస్థ వార్షిక లక్ష్యంలో బెల్లంపల్లి ఏరియా 10 శాతం ఉత్పత్తిని సాధించాల్సి ఉంటుందన్నారు.ఏప్రిల్ నెలలో ఖైరిగూడ ఓసిపి 2,58,688 టన్నులు, బెల్లంపల్లి ఒసిపి 2 ఎక్స్టెన్షన్ 1,02,531 టన్నులు,డోర్లి -1ఓసిపి 2,00638,టన్నుల ఉత్పత్తి సాధించినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ తో పోలిస్తే ఈసారి రెండు శాతం ఉత్పత్తి తగ్గినట్లు తెలిపారు.అదేవిదంగా 17 శాతం బొగ్గు డిస్ ప్యాచ్లు తగ్గినట్లు తెలిపారు.ఏప్రిల్ నెలలో 190 ర్యాక్స్ బొగ్గును సరఫరా చేశామన్నారు. ఇటీవలే గోలేటి సి హెచ్ పి పూర్తి స్థాయి ప్రారంభం కావడంతో మరింత ఎక్కువ బొగ్గు సరఫరా సాధిస్తామన్నారు. వినియోగదారులకు 100 శాతం సరఫరా లక్షంగా పని చేస్తామన్నారు. ఉత్పత్తికి అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. గడిచిన నెలలో ఏర్పడిన ఉత్పత్తి లోటును వచ్చే నెలలో అధిగమిస్తామన్నారు. టెక్నీషన్లు, ఫిట్టర్లు కొరత కొంత ఇబ్బందులకు గురిచేస్తుంది అన్నారు. మే నెలకు గాను వార్షిక లక్ష్యాన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అదేవిదంగా కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు,చల్లని నీటి సౌకర్యాన్ని అందుబాటులో ఉంచామన్నారు ఈ సమావేశంలో ఎస్వోటూ జీఎం శ్రీనివాస్, డిజిఎం పర్సనల్ కిరణ్ ,డీవైపీఎం రాజేశ్వర్, ఐఈడీ ఎస్ ఈ యోహాన్ తదితులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ లో జాబ్ మేళా

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 30 ; కొమురంభీం జిల్లా కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం లో నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళాను సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూర్ మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆసీఫాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. జాబ్ మేళాలో సుమారు 80 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఐటీడీఏ జేడీఎం నాగభూషణం మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నామని మరియు నెలకు తొమ్మిది వేల నుంచి పదివేల జీతం మరియు ఉచిత భోజనం తో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని నిరుద్యోగ యువకులు ఈ ఉద్యోగాల్లో చేరి తమ భవిష్యత్తును బంగారు మయం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డిఆర్డిఓ వెంకట్ , డిపిఎం అన్నాజీ మరియు క్యాంపస్ గ్రూప్ హెచ ఆర్ మధుసూదన్, ప్రీమియం హోంకేర్ హెచ్ఆర్ వసంత్ మరియు ఏపీ ఫెటలిస్ హెచ్చార్ మహేందర్, ఐకేపీ సిబ్బంది సిసిలు పాల్గొన్నారు పాల్గొన్నారు.
Sunday, 29 April 2018
హమాలీల న్యాయమైన హక్కుల సాధన కోసమే సమ్మె ; ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్
Saturday, 28 April 2018
మే డే ను ఘనంగా జరుపుకోవాలి ; ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్
రహదారి భద్రతను జీవిత పాఠ్యాంశంగా చేర్చాలి : జనరల్ మేనేజర్ రవిశంకర్ - మద్యం తాగి వాహనాలు నడపొద్దు ఉమామహేశ్వరరావు ఎంవీఐ
కొమురంభీం జిల్లా కేంద్రంలో కార్డాన్ సెర్చ్

ఉద్యోగ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి: తెలంగాణ జన సమితి జిల్లా సమన్వయకర్త లావుడ్య ప్రేమకుమార్
Friday, 27 April 2018
బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు
Thursday, 26 April 2018
టాస్క్ ఫోర్స్ తనిఖీలలో సుమారు 5,00,000/- విలువ చేసే మద్యం స్వాధీనం
రెబ్బెన మండలంలో నకిలీ పత్తి విత్తనాలపై విస్తృత తనిఖీలు ; ఇద్దరిపై కేసు నమోదు
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి ; ఎస్ వొ టూ జీఎం శ్రీనివాస్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 26 ; విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎస్ వొ టూ జీఎం శ్రీనివాస్ అన్నారు.: బెల్లంపల్లి ఏరియా డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఆధ్వర్యంలో రెండువేల పద్దెనిమిది సంవత్సరానికి సంబంధించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు గురువారం గోలేటిలో బిమన్న స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలో విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రతి క్రీడల్లో నైపుణ్యాలను సాధించాలన్నారు సంస్థల్లో కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా డబ్ల్యూపీఎస్ అనాతవరంలో ప్రతి కంపరం కార్మిక పిల్లల కోసం వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తామన్నారు సీనియర్ అనుభవం కలిగిన సీనియర్ క్రీడాకారులతో చిన్నారులకు క్రీడా మెళకువలు తెప్పిస్తూ క్రీడల అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు నెల్రోజుల్లో పాటు కొనసాగే ఈ శిక్షణ శిబిరాల్లో భాగంగా గోలేటి వాలీబాల్ ఫుట్బాల్ పోటీ ఆధారం పంక్తుల్లో అదిలించి శిక్షణా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ కిరణ్, డివైపిఎం సుదర్శన్, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజ్ శ్రీనివాసరావు, అసిస్టెన్స్ ఫోర్స్ సూపర్వైజర్ రమేష్, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ చంద్రకుమార్, టిబిజికెఎస్ నాయకులు చార్లెస్, తాళ్ళపల్లి రాములు తదతరులు పాల్గొన్నారు. కనకదుర్గ దేవి జాతర గోడ ప్రతుల విడుదల

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 26 ; రెబ్బెన మండల కేంద్రం ఇందిరానగర్ లోని కనకదుర్గ దేవి మరియు స్వయంభూ మహంకాళి అమ్మవారి జాతర వచ్చే నెల 1,2,3 తేదీలలోజరగనుండడంతోగురువారం జాతర గోడ ప్రతులను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి విడుదల చేసారు. తదనంతరం అమ్మవారిని దర్శించుకొని జాతరకు సంబందించిన ఏర్పాటు వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మెన్ అభినవ సంతోష్ కుమార్, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శులు మోడెమ్ తిరుపతి గౌడ్, లెక్కల నవీన్ కుమార్, సంయుక్త కార్యదర్శి అవుల రాజనర్సు, మస్కా రమేష్, సంధ్య, అనిత, మధుకర్ ,సంతోష్ , తిరుపతమ్మ, లలిత, గ్రామ ప్రజలు మరియు ఆలయ పూజారి దేవార వినోద్ తదితరులు పాల్గొన్నారు.చేపల పెంపకం కై చెరువు అభివృద్ధి పనులు ప్రారంభం
Wednesday, 25 April 2018
మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయాలి ; చీఫ్ ఇంజనీర్ జగన్మోహాన్ రెడ్డి
సమ్మర్ కోచింగ్ క్యాంప్.
టాస్క్ ఫోర్స్ సంచలన దాడిలో మద్యం, కలప మరియు గుట్కా నిల్వ పట్టివేత
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 25 ; వాంకిడి మండల లోని ఇందాని, బెండార గ్రామంలో అక్రమంగా మద్యం,గుట్కా మరియు కలప నిల్వలు ఉన్నట్లు ఖచ్చితమైన నిఘా సమాచారంతో టాస్క్ ఫోర్స్ సి.ఐ అల్లం రాంబాబు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృ దం తనిఖీ చేసారు. ఈ తనిఖీలో కుదురుపాక సాంబయ్య ఇంట్లో అక్రమంగా అమ్ముతున్న 16,345/- విలువగల మద్యం మరియు 4,860/- విలువగల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. బెండార గ్రామంలో తనిఖీ నిర్వహించగా గులాబ్ షాపులో 6,255/- విలువగల మద్యం మరియు నగోష శేఖర్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 24,000/- విలువ చేసే 10 ఫీట్ల టేకు చెక్కలు, 19,740/- విలువ చేసే మద్యం మరియు 2,852/- విలువగల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం వాంకిడి పి.ఎస్. పోలీస్ వారికి అప్పగించడం జరిగిందన్నారు. టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్ లు ఉన్నారు.రైలు కిందపడి వ్యక్తి మృతి
Tuesday, 24 April 2018
చికిత్స పొందుతున్న మహిళ మృతి
పురుగుల మందు సేవించి రైతు మృతి ; రైతును మింగిన అప్పులు
ప్రభుత్వ ఆస్పత్రిలో అల్ఫాహారం పంపిణీ

టాస్క్ ఫోర్స్ దాడిలో రవాణాకు సిద్దంగా ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

టాస్క్ ఫోర్స్ మెరుపు దాడిలో మద్యం మరియు బెల్లం నిల్వ పట్టివేత
Monday, 23 April 2018
అగ్ని ప్రమాదంలో మహిళకు గాయాలు
గిరిజన మండలాలలో పర్యటించిన బీజేపీ బృందం ;
కేంద్రప్రభుత్వ పథకాల అమలు తీరు పై కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ సమీక్ష
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 23 ; కేంద్రప్రభుత్వ పథకాల అమలు తీరును కేంద్రప్రభుత్వ అర్బన్ అఫైర్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ సెక్రటరీ జానకి సోమవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామంలోజరిగిన గ్రామ సభలో సమీక్షించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలద్వారా మారుమూల గ్రామాలలోని ప్రజలకు లబ్ది అందేలా చూడాలని అన్నారు.ఏప్రిల్ 15 నుంచి మే 5 వరకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు మరియు వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారుభారత దేశంలో ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు ప్రజల్లో ఈ పథకానికి సంబంధించి అవగాహన ఉన్న కూడా ఈ పథకానికి దూరంగా ఉంటున్నారన్నారు. సంబంధిత శాఖ వారు ఈ విషయంపై దృష్టి సారించి ప్రతి ఒక్కరికి భీమా యోజన పథకం వర్తింపజేయాలన్నారు. భీమా ప్రీమియం తక్కువ మరియు భీమా ఎక్కువ అని అన్నారు. ప్రతిఒక్కరు భీమా చేసుకొనేటట్లు కృషి చేయాలన్నారు. అలాగే ప్రధాన మంత్రి సౌభాగ్య యోజన పథకం ద్వారా పల్లె, పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి విద్యుత్తును అందించడంలో భాగంగా సౌభాగ్య యోజన అనే పథకాన్ని ఆవి ష్కరించారు.అన్నారు. ఇప్పటి కీ విద్యుత్ అందని ఇంటికి సౌభాగ్య పథకం కింద ప్రతి ఇంటికి విద్యుత్తు అందించాలని అన్నారుఎటువంటి ఖర్చు లేకుండా కరెంటు మీటర్ పొందవచ్చని అన్నారు. ఇంకొక పథకమైన మిషన్ ఇంద్రధనష్ పేద మహిళలు ఈ సేవలను వినియోగించుకోవాలని, శిశుమరణాలను తగ్గించడానికి మిషన్ ఇంద్రధనష్ ద్వారా వ్యాక్సినేషన్లను తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. మిషన్ ఇంద్రధనస్సు లో వైద్య సిబ్బంది మరియు ఆశ కార్యకర్తలు గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు.ప్రధాన మంత్రి ఉజ్వాల యోజన ఈ పథకం ద్వార దారిద్ర రేఖకు దిగువగ ఉన్న ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ కనెక్షన్లను కేంద్ర ప్రభుత్యం అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్ లను అందచేశారు. ఈ పథకాన్ని గ్యాస్ లేని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ప్రధాన మంత్రి జన ధన్ యోజన ఈ స్కీంలో భాగంగా ఖాతాతెరచిన ప్రతి వ్యక్తి కుటుంబం మొత్తo తమ జీవిత కాలమంతా లక్ష రూపాయల ప్రమాద భీమాకు అర్హత లభిస్తుంది అన్నారు. జీవిత భీమా సదుపాయాన్ని బ్యాంకు ఖాతా ద్వారా రెన్యూవల్ చేసుకొని ప్రమాద భీమా పొందవచ్చని సూచించారు. డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా భౌతికంగా డబ్బు మార్పులేని ఆర్ధిక వ్యవస్థకు పునాది వేయడమే జన్ ధన్ యోజన యొక్క దీర్ఘకాలిక ప్రణాళిక అని అన్నారు.అనంతరం కొమురంభీం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను ప్రతి ఒక్క శాఖ వారు కూడా విధిగా లబ్ధిదారులకు అందే విదంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కారక్రమంలో మంచిర్యాల్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, డిఆర్డిఓ వెంకట్,డిపిఓ గంగాధర్,డి ఎం హెచ్ ఓ సుబ్బారాయుడు,డిప్యూటీ డిఎమ్హెచ్ఓ సీతారాం,పిడి సావిత్రి, రెబ్బెన ఎమ్మెర్వో సాయన్న ,ఎంపిడివో సత్యనారాయణ సింగ్,ఎంఈవో వెంకటేశ్వర స్వామి తదితర మండలాధికారులు పాల్గొన్నారు.Sunday, 22 April 2018
స్వయం ఉపాధి కల్పించుకోవడం సంతోషదాయకం ; ఎమ్మెల్యే కోవా లక్ష్మి
యువత మంచి లక్షణాలు అలవర్చుకోవాలి ; ఎమ్మెల్యే కోవలక్ష్మి
బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలి వేంద్రం ఏర్పాటు
Saturday, 21 April 2018
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: టాస్క్ ఫోర్స్ సి ఐ రాంబాబు
Friday, 20 April 2018
ప్రధానమంత్రి ఉజ్వల్ అభియాన్ పథకంలో వంట గ్యాస్ పంపిణి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 20 ; ప్రధానమంత్రి ఉజ్వల్ అభియాన్ పథకం ద్వారా రెబ్బెన మండలం తుంగ డ గ్రామంలో శుక్రవారం పలువురు మహిళలకు వంట గ్యాస్ కనెక్షన్ లను అందచేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మి బాయి , హెచ్ పి గ్యాస్ డీలర్లు ప్రకాష్ అగర్వాల్, రాకేష్ అగర్వాల్ లు వంటగ్యాస్ పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ పథకం కింద లబ్ది దారులకు సబ్సిడీ పైన గ్యాస్ కనెక్షన్ లను అందచేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్యాస్ కనెక్షన్ వాడటం వళ్ళ వంట చెరుకు కోసం చెట్లను నరికివేత కాస్తైనా తగ్గుముఖం పడుతుంది అని అన్నారు. పాతపద్ధతిలో కాకుండా వంట గ్యాస్ పైననే వంట చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు భగవాన్ , పర్వతాలు, వార్డ్ మెంబెర్ లు రుక్కుమ్ బాయి , పార్వతి ,అంగన్వాడీ కార్యకర్త అమృత, ఫీల్డ్ అసిస్టెంట్ రహీమ్ పాషా, వి ఆర్ ఓ లు వెంకటేష్, నాందేవ్ గ్రామస్తులు పాల్గొన్నారు. పాలీసెట్ కు ఏర్పాట్లు పూర్తి
బెల్లంపల్లి ఏరియాకు బంగారు భవిష్యత్తు ఉంది : ప్లానింగ్ డైరెక్టర్ భాస్కర్ రావు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 20 ; బెల్లంపల్లి సింగరేణి ఏరియాకు బంగారు భవిష్యత్ ఉందని ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ భాస్కర్ రావు అన్నారు. గురువారం బెల్లంపల్లి ఏరియా రెబ్బెన మండలం గోలేటి క్రాస్ రోడ్డు వద్ద తొంభై రెండు కోట్లతో నూతనంగా నిర్మించిన సి హెచ్ పి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై శిలా ఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాలోని ఓపెన్ కాస్టుల ద్వారా బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు గతంలో నలభై మిలియన్ల టన్నుల బొగ్గును మాత్రమే బెల్లంపల్లి ఏరియా నుండి ఉత్పత్తి చేసేవారన్నారు. ప్రస్తుతం సంవత్సరానికి డెబ్బై మిలియన్ల ముత్తన్నలు బొగ్గుని ఉత్పత్తి చేస్తున్నారన్నారు సింగరేణి ఏరియాలో ప్రత్యేకంగా బెల్లంపల్లి ఏరియా గుర్తింపు తెచ్చుకుందన్నారు ఏరియా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సి హెచ్ పి ని నిర్మించడం జరిగిందన్నారు. ఏరియాలో నూతన గనులు రానున్నాయని బొగ్గు ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని సి హెచ్ పి ఏర్పాటు చేసిన్నట్లు పేర్కొన్నారు. సి హెచ్ పి నిర్మాణంతో కాలుష్యాన్ని గణనీయంగా నివారించడంతో పాటు రోడ్డు మార్గంలో బొగ్గు సరఫరా సాధ్యమైనంత తగ్గించుకోగలిగామన్నారు వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సకాలంలో చేరవేయడానికి సి హెచ్ పి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏరియా జిఎం రవిశంకర్ మాట్లాడుతూ సి హెచ్ పి ఏర్పాటుతో బొగ్గు రవాణాకు ఎంతో సులువైన మార్గం అన్నారు ప్రతిరోజు మూడు రేకుల బొగ్గును సరఫరా చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నామని సి హెచ్ పి నిర్మాణానికి సహకరించిన రైతులకు, రెవెన్యూ, రైల్వే అధికారులకు కృతజతలు తెలిపారు 2014 ప్రారంభం కావలసిన సి హెచ్ పి నిర్మాణం పనులు అనివార్య కారణాల వల్ల 2015 ప్రారంభోత్సవం కావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి జీఎం సుభాని,మందమర్రి జీఎం రాఘవులు, రైల్వే ఏవో సురేష్ రెడ్డి ,ప్రాజెక్టు ఆఫీసర్లు కొండయ్య మోహన్ రెడ్డి, శ్రీనివాస్, డిజిఎం పర్సనల్ కిరణ్ డిజిఎం సీఆర్పీ విశ్వనాథ్, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు ఎంయు ఇంజినీర్ రామారావు, డివై పిఎం రామశాస్త్రి, అసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ తదతరులు పాల్గొన్నారు .





























