Monday, 31 August 2015

క్లోరినేషన్ చేపట్టిన మళ్ళీ పురుగుల నీళ్ళు

క్లోరినేషన్  చేపట్టిన మళ్ళీ పురుగుల నీళ్ళు

రెబ్బెన లోని సబ్ స్టేషన్ వెళ్ళే కాలనీలో క్లోరినేషన్ చేపట్టిన మళ్ళీ పురుగుల నీళ్ళు ఆదివారం నాడు వచ్చినట్లే సోమవారం నాడు కూడా కుళాయిల నుండి మంచి నీటిలో పురుగులు వచ్చాయని కాలనీ వాసులు ఆందోళన చెందడంతో సర్పంచ్ పెసరు వెంకటమ్మ మరియి కార్యదర్శి రవీందర్ పరిశీలించగా అందులో పురుగులు ఉన్నట్లు గమనించారు. క్లోరినేషన్ చేపట్టిన ఇలా పురుగుల నీరు ఎందుకు వచ్చాయని కాలనీవాసులు వారిని నిలదీశారు. వారు మాట్లాడుతూ కాలనీలోని పైపు లైనుని మరమత్తు చేపిస్తామని, ఇలా మురికి నీరు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. వీరితో పాటు ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, తెరాస తూర్పు జిల్లా అధ్యక్షుడు నవీన్ జైశ్వాల్, కారోబారి తిరుపతి, జంషీద్, రమేష్, గోపి, కిరణ్ , నాగరాజు, అప్పారావు తదీతరులు ఉన్నారు.

మండలానికి 108 వాహనాన్ని కేటాయించాలి

మండలానికి 108 వాహనాన్ని కేటాయించాలి



రెబ్బెన మండల కేంద్రానికి 108 అంబులెన్సు వాహనం లేక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని జెఎసి కన్వీనర్ మోడెమ్ సుదర్శన్ గౌడ్ రెబెన తహశిల్దార్ రమేష్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ గతంలో మండల కేంద్రానికి 108 వాహనం కేటాయించిన దానిని కొన్ని కారణాల వలన తాండూర్ కు తరలించారని దీంతో రెబ్బెన మండల కేంద్రంలో 108 అంబులెన్సు లేక ఇబ్బందులు పడుతున్నారని,  విషజ్వరాలు వ్యాపించే వర్షాకాలంలో అంబులెన్సు లేక ప్రైవేటు అంబులెన్సులను ఆశ్రయిస్తున్నారని, గతంలో ఈ విషయం గురించి ఎమెల్యే కోవా లక్ష్మికి తెలుపగా చర్యలు తీసుకుంటానని అన్నారు, ఆదివారం నాడు రెబ్బెనలో రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగిన రెండు గంటల తరువాత అంబులెన్సు వచ్చిందని దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిందని అన్నారు. ఈ కార్యాక్రమంలో ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, తెరాస తూర్పు జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ జైశ్వాల్, తెరాస రెబ్బెన టౌన్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్, మోడెమ్ రాజేంద్రప్రసాద్,  ఎఅయ్ఎస్ఆఫ్ డివిజన్ అధ్యక్షుడు గోగర్ల రాజేష్ , జహురోద్ధిన్, ముంజం వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sunday, 30 August 2015

నీటి ట్యాంక్ ను శుభ్రం చేసిన పంచాయితి సిబ్బంది

నీటి ట్యాంక్ ను శుభ్రం చేసిన పంచాయితి సిబ్బంది



మంచినీరు రావాల్సిన మంచి నీటి ట్యాంక్ నుండి ఆదివారం నాడు ఉదయం కుళాయి తిప్పగా పురుగులు, క్రిమి కీటకాలు వచ్చాయని రెబ్బెన ప్రజలు ఆవేదన చెందడంతో డీపీవో పోచయ్య , ఎమ్మార్వో రమేష్ గౌడ్ ఆదేశాల మేరకు సర్పంచ్ పెసరు వెంకటమ్మ వెంటనే ఆ మంచి నీటి ట్యాంక్ ను శుభ్రం చేశారు. అనంతరం పంచాయితి కార్యదర్శి రవీందర్ మాట్లాడుతూ ఇటువంటి పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని,  క్లోరినేషన్ చేపట్టామని, ఉదయం మంచి నీళ్ళలో పురుగులు వచ్చిన కాలనీలోని పైపు లైను ను పరిశీలిస్తామని, ఇలాంటి సమస్యలు ఎవైన ఉంటె తమ దృష్టికి తీసుకు రావలసిందిగా తేలిపారు.ఈ కార్యాక్రమంలో ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, తెరాస తూర్పు జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ జైశ్వాల్, మండల యూత్ ప్రెసిడెంట్ వెంకట్రాజం, సింగిల్ విండో డైరెక్టర్ పెసరు మధనయ్య, రెబ్బెన గ్రామ ప్రజలకు పాల్గొన్నారు.

ప్రమాదవశాత్తు రైలు క్రింద పడిన మహిళ

ప్రమాదవశాత్తు రైలు క్రింద పడిన మహిళ


రెబ్బెన లోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ లో ఆదివారం నాడు మధ్యాహ్నం 3.30 గం,లకు  రెబ్బెన నుండి కాగజ్ నగర్ వెళ్లేందుకు దహేగాం కు చెందిన చావలి (35) అనే మహిళ సింగరేణి రైలు ఎక్కేటప్పుడు ప్రమాదవశాత్తు రైలు కింద పడింది.  దీంతో ఆమె తలకు, కాలుకు తీవ్ర గాయలవడంతో తీవ్ర రక్త స్రావం జరిగింది. ఇంత జరుగుతున్నా గాని రైల్వే సిబ్బంది పట్టించు కాకపోవడంతో గంటపాటు ఆమెను అక్కడే ఉంచారు, అనంతరం 108 అంబులేన్సులో ఆసుపత్రికి పంపించారు.

సమ్మెను విజయవంతం చేయండి

సమ్మెను విజయవంతం చేయండి 

సెప్టెంబరు 2న తలపెట్టే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏ,అయ్,టీ,యు,సీ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం 15000 వరకు పెంచాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకం ఆపాలని,కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్సై,పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అన్నారు. ఈ కార్యాక్రమంలో సంతోష్, లింగంముర్తి, తిరుపతి, పొశమల్లు  తదితరులు పాల్గొన్నారు.

జాగృతిలో పలువురి చేరిక

జాగృతిలో పలువురి చేరిక



తెలంగాణ జాగృతి మండల స్థాయి సమావేశాన్ని రెబ్బెనలోని రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆదివారం నాడు ఉదయం 10.గం,లకు నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిధిగా జాగృతి జిల్లా కన్వీనర్ లింగంపల్లి ప్రేమ్ రావు హాజరై జాగృతి జిల్లా కన్వీనర్ విద్యార్ధి నాయకుడు ఎన్, వెంకటేష్ ఆధ్వర్యంలో పలువురు జాగృతిలో సభ్యులుగా చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్ విడనాడాలని, గుడుంబా నిర్మూలనకు ప్రతి విద్యార్ధి కృషి చేయాలని, గ్రామాలలో మరుగుదొడ్లు ప్రతి ఒక్కరు నిర్మించుకోవాలని అన్నారు. ఈ కార్యాక్రమంలోవిద్యార్ధి నాయకులు సాగర్, సంతోష్, శ్రావణ్, గోపాల్, సాయి మహేందర్, మహేష్ తదీతరులు పాల్గొన్నారు.

Saturday, 29 August 2015

మంచి నీళ్ళుకు బదులు పురుగుల నీళ్ళు---ఎక్కడిదక్కడే పారిశ్యుద్ధం

మంచి నీళ్ళుకు బదులు పురుగుల నీళ్ళు---ఎక్కడిదక్కడే పారిశ్యుద్ధం



మంచినీరు రావాల్సిన మంచి నీటి ట్యాంక్ నుండి ఆదివారం నాడు ఉదయం కుళాయి తిప్పగా పురుగులు, క్రిమి కీటకాలు, చెత్త వచ్చాయని రెబ్బెన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి పారిశుద్ధం అక్కడే ఉంటె అసలే వర్షా కాలం విష జ్వరాలు వ్యాపిస్తున్న సమయంలో ఇలా పురుగులతో కూడిన నీరు వస్తే ఎలా అని అంటున్నారు. రెబ్బెన ప్రజలు నీటిని కాచి చల్లార్చి వడపోసుకొని త్రాగావలసిందిగా తెరాస తూర్పు జిల్లా ఉపాధ్యక్షుడు  నవీన్ కుమార్ జైశ్వాల్ రెబ్బెన గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ కోసం ఎంపీ గెడెం నగేష్ కు వినతి పత్రం

ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ కోసం ఎంపీ గెడెం నగేష్ కు వినతి పత్రం


రెబ్బెన లోని  ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్  నుండి రాకపోకలు జరుపే  ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారాని ఎంఎల్ఎ కొవలక్ష్మి,  అధ్యక్షుడు పురాణం సతీష్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఎంపీ గెడెం నగేష్ కు  రెబ్బెన ప్రజలు వినతి పత్రాన్ని అందజేశారు.  ప్రజలు మాట్లాడుతూ  రైల్వే స్టేషన్ లో ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ లేక స్టేషన్ వెనకాల ఉన్న కాలనివాసులు, వ్ర్రుద్దులు  ; మహిళలు ; పిల్లలు;వికలాంగులు ఫ్లాట్ ఫాం 1 నుండి ఫ్లాట్ ఫాం 2 వైపు వెళ్ళడానికి ఈబ్బందీగా వుందని, అదే విధంగా జనవరి నెలలో ఆసిఫాబాద్ కి చెందిన అబ్దుల్ నయిం అనే సైకిల్ వ్యాపారి రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ కింద పడి  మృతి చెందాడు.  అదే విధంగా తెలంగాణ రైలును ఆపాలని  అసిఫాబాద్ నియోజక వర్గానికి గల ఎకైక రైల్వే స్టేషన్ ఈ స్టేషన్ నుండి రోజుకు దాదాపు 800 మంది ప్రయాణికులు అసిఫాబాద్ ,వాంకిడి, కేరమెరి, జైనూరు ,రెబ్బెన మండలాల మరియు గోలేటి, నంబాల, గంగాపూర్, జక్కులపల్లి, కొమురవెళ్ళి,  నార్లాపూర్, పుంజుమేరగూడ, సింగల్ గూడ,  కొండపల్లి, వాంకిడి,  కెరమెరి  గ్రామాల ప్రజలు ఈ  స్టేషన్ నుండి రాకపోకలు సాగిస్తున్నారని . నిజాం కాలం నాటి ఈ  రైల్వే స్టేషన్ దాదాపు 50 సం,, రాల  అసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ ఈప్పటికీ ఏఅబివృద్దికి నోచుకోలేదు మురుగుదోడ్లు, మూత్రశాలలు, విశ్రాంతి గదులు, త్రాగునీటి సదుపాయాలు కల్పించాలని  ప్రయాణికులు కోరుతున్నారు. ఈప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు  అధికారులు మారినా పట్టించుకోవడం లేదని అన్నారు, ఈ కార్యాక్రమంలో ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, జిల్లా తెరాస ఉపాధ్యక్షులు నవీన్ జైశ్వాల్, గోలేటి ఉపసర్పంచ్ రవి నాయక్, వార్డు మెంబర్ చిరంజీవి, వెంకట్రాజం, రెబ్బెన మండల ప్రజలు పాల్గొన్నారు.

ఘనంగా మన గుడి కార్యాక్రమం

ఘనంగా మన గుడి కార్యాక్రమం


రెబ్బెన మండల కేంద్రంలోని సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం రాఖి పౌర్ణమి సందర్భంగా  మన గుడి కార్యక్రమం కమిటి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన కంకణాలు ,ప్రసాదం , కుంకుమార్చన పూజాసామాగ్రిని భక్తులకుఅందజేశారు. అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలను నాటారు. ఈకార్యక్రమంలో కమిటి మెంబర్లు సుదర్శన్‌ గౌడ్‌, నవీన్ జైశ్వాల్,బొమ్మినేని శ్రీధర్‌, శంకరమ్మ , సోమశేఖర్‌, సర్పంచులు , వెంకటమ్మ, ముంజం రవీందర్‌, నాయకులు హన్మంతు, దుర్గారావ్‌, సర్వేశ్వర్‌ గౌడ్‌ , వార్డు మెంబర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ జాగృతి మండల స్థాయి సమావేశం

తెలంగాణ జాగృతి మండల స్థాయి సమావేశం

తెలంగాణ జాగృతి మండల స్థాయి సమావేశాన్ని ఆదివారం నాడు ఉదయం 10.గం,లకు  రెబ్బెనలోని రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహిస్తున్నామని జాగృతి విద్యార్ధి నాయకుడు ఎన్, వెంకటేష్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిధిగా జాగృతి జిల్లా కన్వీనర్ లింగంపల్లి ప్రేమ్ రావు విచ్చేస్తున్నారని, మండలంలోని విద్యార్థులు, మహిళలు, అన్ని శాఖల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయగలరని కోరారు.

Friday, 28 August 2015

అన్నాచెల్లెళ్ళ అనుబంధం--రక్షాబంధన్


రెబ్బెనలోని సాయి విద్యాలయం పాటశాలలో కరస్పాండెంట్ దీకొండ సంజీవ్ కుమార్ మరియి ఉపాధ్యాయిల ఆధ్వర్యంలో రక్షాబంధన్‌ కార్యాక్రమాన్ని నిర్వహించారు.విద్యార్థులు రాఖీలు కట్టుకొని ఒకరికొకరు రక్షా బంధన్‌ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.రక్షా బంధన్‌ యొక్క ప్రాముఖ్యతను తెలిపి, రక్షా బంధన్‌ అన్నాచెల్లెళ్ల అనుంబందానికి  నిదర్శమని అన్నారు.

కన్నుల పండువగా వరలక్ష్మి వ్రతం

రెబ్బెన మండలం లోని పలు దేవాలయాల్లో  శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజ కార్యక్రమలు  కన్నుల పండువగా జరుపుకున్నారు. గోలేటిలోని  శ్రీ  కోదండ రామాలయంలో వరలక్ష్మి వ్రతం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గున్నారు.  ఈ వ్రతాన్ని చేపట్టడం వల్ల  వారి కుటుంబాలలో సర్వ సుఖ సంతోషాలతో వెలసిల్లుతాయని వేద పండితులు అన్నారు. శ్రావణ మాసంలో  వచ్చే ఈ వరలక్ష్మి పూజను నవ అమృత పానియాలతో మరియు పూలు పండ్లు ఆకు వక్క తంబులాలు ఇచ్చిపుచ్చుకోవడాలు ఆనవాయితీగా వస్తుంది ఈ విదంగా భారత దేశ సంప్రదాయాలకు ఆచారాలకు పెట్టింది పేరుగా మహిళామణులు వన్నేతేస్తున్నారు 

భూ నిర్వాసితులకు అండగా సింగరేణి -జి .యం రవి శంకర్

బెల్లంపల్లి ఏరియా గోలేటి జీ,యం రవి శంకర్ శుక్రవారం నాడు కేస్లాపూర్ లోని భూ నిర్వాసితుల  పునరావాస కేంద్రంలో కమిటీ  నూతన పాటశాల భవనానికి కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేశారు. అనంతరం సింగరేణి సంస్థలోభూములు కోల్పోయిన భూ నిర్వాసితుల సమస్యలపై చర్చించారు ఈ సమావేశంలో జీ,యం రవి శంకర్ మాట్లాడుతూ సింగరేణిలో భూములు కోల్పోయిన వారికీ భూ పట్టాలను అందజేస్తామని అన్నారు. వాటర్ ట్యాంక్ నిర్మించి ఇంటింటా నీటి సదుపాయం కల్పిస్తామని, నిరుద్యోగ యువత ఒక సంఘంగా ఏర్పడితే  అర్హులైన వారికి కాంట్రాక్ట్  పనులను పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డి.  జి,యం  చితరంజన్, డి,జి,యం(సివిల్) రామకృష్ణ, టి,జి,బీ,కే,యస్ కార్యదర్శి యన్,సదాశివ్ఏ,ఐ,టీ,యు,సీ,కార్యదర్శి యస్,తిరుపతి, ప్రాజెక్ట్ అధికారి సంజీవ్ రెడ్డి , డి,వై,పి,యం రాజేశ్వర్ రావు, కార్యాలయ సిబ్బంది, తదితరులు  పాల్గొన్నారు

ఆర్మీ ఉద్యోగాల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

పోలీసు, ఆర్మీ ఉద్యోగాల కోసం సన్నద్దమవుతున్న అభ్యర్థులకు సేవా సమితి ఆధ్వర్యంలో అందించనున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని బెల్లంపల్లి ఏరియా డీజీఎం పర్సనల్‌ చిత్తరంజన్‌ కుమార్‌ కోరారు. బెల్లంపల్లి ఏరియాలోని కార్మికులు, మాజీ కార్మికులు భూనిర్వాసిత పునరావాస కేంద్రాల్లోని నిరుద్యోగ యువకులకు భీమన్న స్టేడియంలో పోలీసులు, ఆర్మీ ఉద్యోగాల కోసం సేవాసమితి ఆధ్వర్యంలో శిక్షణను అందించనున్నట్లు తెలిపారు

మనగుడి కార్యక్రమం

రెబ్బెన మండల కేంద్రంలోని సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో మన గుడి కార్యక్రమం కమిటి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని ప్రధానకార్యదర్శి సుదర్శన్‌ గౌడ్‌ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన కంకణాలు ,ప్రసాదం , కుంకుమార్చన పూజాసామాగ్రి వచ్చిందని, ఇట్టి విషయాన్ని గ్రహించి భక్తులు , ప్రజలు అధికారులు , అనధికారులు విచ్చేసి ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈకార్యక్రమంలో కమిటి మెంబర్లు అధ్యక్షులు ఎల్‌గంటుమెర, ఉపాధ్యక్షులు శంకరమ్మ , శ్రీధర్‌, సోమశేఖర్‌, సర్పంచులు , వెంకటమ్మ, ముంజం రవీందర్‌, నాయకులు హన్మంతు, దుర్గారావ్‌, సర్వేశ్వర్‌ గౌడ్‌ , తదితరులు తెలిపారు

Thursday, 27 August 2015

గుడుంబా వద్దు - మంచి నీళ్ళే ముద్దు




రెబ్బెన మండలంలోని పులికుంట లో గురువారంనాడు  గ్రామజ్యోతి ప్రత్యేకాదికారి రెబ్బెన ఎస్ఐ  సిఎచ్ హనోక్ అద్వ్యర్యంలో గుడుంబా నివారణ కమిటీ తరపున ర్యాలీ  నిర్వహించారు. ఈ సందర్భంగా గుడుంబా వద్దు - మంచి నీళ్ళే ముద్దు,గుడుంబా తాగకు - గుండె పగిలి చావకు, గుడుంబా మాని సుఖ సంతోషాలతో జీవించండి అంటూ నినదిస్తూ  గ్రామంలో అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో గుడుంబా నివారణా కమిటి చైర్మన్ నంబాల సర్పంచ్ గజ్జెల సుశీల, డైరెక్టర్ సత్తన్న, పాతశాల విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.   

ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ ను సందర్శించిన సికంద్రాబాద్ డి ఆర్ ఎమ్





రెబ్బెన మండలంలోని ఆసిఫాబాద్ రైల్వే స్టేషన్ ని  సికందరాబాద్ రైల్వే డి.ఆర్.ఎం. అశేష్ అగర్వాల్  సందర్శించారు. వారితో పాటు సింగరేణి బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రవి శంకర్ పాల్గొన్నారు. రెబ్బెన లోని బొగ్గు లోడింగ్ యార్డ్, సి. ఎస్.పి. పనులను మరియు స్టేషన్ వసతులను పరిశీలించారు. వీరి వెంట రైల్వే ఉద్యోగులు,ప్రజలు పాల్గొన్నారు

దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి


సెప్టెంబరు 2న తలపెట్టే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీ,అయ్,టీ,యు జిల్లా ఉపాధ్యక్షులు లోకేష్ అన్నూరు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీస వేతనం 15000 వరకు పెంచాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకం ఆపాలని,కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్సై,పెన్షన్ సౌకర్యం కల్పించాలని,45 రోజుల్లో కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యాక్రమంలో ఆశ కార్యాకర్తలు అనిత,రమ,రాజేశ్వరి,సుకన్య, అంగన్వాడి కార్యాకర్తలు చంద్రకళ, రాజేశ్వరి,ప్రమీల, ఇంద్ర,భారతి, మాయ, మల్లుబాయి, తదితరులు పాల్గొన్నారు.



అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత

రెబ్బెన మండలంలోని గోలేటి శివారు ప్రాంతలోని అక్రమమట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను రెబ్బెన మండల తహసీల్దార్‌ రమేష్ బాబు పట్టుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తమకు వచ్చిన ముందస్తు సమాచారంతో అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను, జెసిబి ను పట్టుకున్నట్లు,పట్టుకున్న ట్రాక్టర్లకు జరిమాన విధించిన్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఎక్కడైనా అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని అన్నారు.

అవినీతి సర్పంచ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

రెబ్బెన మండలంలోని గోలేటిలో గ్రామ పంచాయితి నిధులను దుర్వినియోగం చేసిన అవినీతి సర్పంచ్ తోట లక్ష్మణ్  పై గురువారం నాడు గ్రామ ప్రజలు గ్రామ పంచాయితి కార్యాలయం ముందు ధర్నా చేసి అనంతరం రెబ్బెన పోలీస్ స్టేషన్ లో ఎస్సై సీఎచ్ హనూక్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ దుర్వినియోగం చేసిన పంచాయితి నిధులను స్వాధీనం చేయాలని, క్రిమినల్ కేసు పెట్టాలని  గతంలో కూడా పైఅధికారులకు ఫిర్యాదు చేయగా చెక్ పవర్ రద్దు చేశారు కాని ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఇప్పటి కైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు పెట్టాలని అన్నారు. ఏమ్పీటీసీ లావుడ్య మురళి బాయి, వార్డు సభ్యులు సుశీల,పుష్ప, తిరుపతి, తే,దే,పా జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి, భాజపా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేసరి ఆంజనేయిలు గౌడ్, మాజీ ఏమ్పీటీసీ కడతల మల్లయ్య, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బోగే ఉపేందర్, ఎఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్, గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 25 August 2015

కలిసి పోరాడినప్పుడే రాజ్యాధికారం

                        


రాష్ట్రంలో బీసీలు అందరు ఐక్యంగా ఉండి పోరాడితేనే తప్ప రాజ్యాధికారం రాదని బీసి ఐక్య సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు అంజనేయుల గౌడ్  అన్నారు గురువారం ఆర్అండ్ బీ అతిధి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ నిరుపేదలకు 3ఎకరాల భూమి ఇవ్వాలని, కళ్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింప చేయాలని, మంత్రి శాఖకి కేటాయించాలని,చట్ట సభల్లో బీసి లకు 50% శాతం రిజర్వేషన్ కావాలని అన్నారు.ఈ సమావేశంలో తదీతర బీసి ఐక్యసంఘ నాయకులు పాల్గొన్నారు.

కార్మికుల అవసరాలను తీరుస్తాం--జీ,యం రవి శంకర్

కార్మికుల అవసరాలను తీరుస్తాం--జీ,యం రవి శంకర్ 



బెల్లంపల్లి ఏరియా గోలేటి జీ,యం రవి శంకర్ సోమవారం నాడు రెబ్బెన మండలంలోని ఇందిరానగర్ లోని కార్మికుల పునరావాస కేంద్రంలో కమిటీ హాల్ ని ప్రారంభించారు అనంతరం నూతన పాటశాల భవనానికి కొబ్బరికాయ కొట్టి భుమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య శిభిరాన్ని ఏర్పాటు చేసారు. కార్మికుల కుటుంబాలకు పరీక్షించి మందులను పంపిణీ చేసారు. అనంతరం కార్మికుల సమస్యలపై చర్చించారు ఈ సమావేశంలో జీ,యం రవి శంకర్ మాట్లాడుతూ సింగరేణిలో భూములు కోల్పోయిన వారికీ భుపట్టాలను అందజేస్తామని అన్నారు. కార్మికుల బాగోగులే సంస్థకి ముఖ్యం అన్నారు  వాటర్ ట్యాంక్ నిర్మించి ఇంటింటా నీటి సదుపాయం కల్పిస్తామని, నిరుద్యోగ యువతన ఒక సంఘంగా ఏర్పడి ఉట్నూర్ ఆదిలాబాద్ వారిచే రిజిస్టర్ చేసుకొని ఆ పత్రాలను జీ,యం కార్యాలయం లో  అందజేసి అర్హులైన వారికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగవకశాలను, పనులను పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో
డి,జి,యం  చితరంజన్, డి,జి,యం(సివిల్) రామకృష్ణ, టి,జి,బీ,కే,యస్ కార్యదర్శి యన్,సదాశివ్ఏ,ఐ,టీ,యు,సీ
,కార్యదర్శి యస్,తిరుపతి, ప్రాజెక్ట్ అధికారి సంజీవ్ రెడ్డి , డి,వై,పి,యం రాజేశ్వర్ రావు, డాక్టర్ రమ్య, వైద్య సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, తదితరులు  పాల్గొన్నారు.

Monday, 24 August 2015

గిరిజనులకు వైద్య సదుపాయం అందించండి-రవీందర్

గిరిజనులకు వైద్య సదుపాయం అందించండి-రవీందర్ 

గిరిజన ప్రాంతంలలో ఉన్న విద్యార్థిని, విద్యార్థులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఏ,ఐ,ఎస్,ఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్ అన్నారు, సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లడుతూ గిరిజన ప్రాంతాల్లో విజ్రుంభిస్తున్న విష జ్వరాల వలన అక్కడి ప్రజలు చనిపోతున్నారని వారికి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అన్నారు.

గోలేటిలో స్వచ్ఛ భారత్‌

గోలేటిలో స్వచ్ఛ భారత్‌


రెబ్బెన మండలంలోని గోలేటిలో బీజేపీ నాయకుడు ఏబీ పౌడల్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌లో ప్రతి ఒక్కరు  భాగస్వాములై గ్రామాన్ని అభివృద్ది పథంలో నడిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఇంచార్జీ డిప్యూటి తహసీల్దార్‌ రాంమోహన్‌ రావ్‌, రెబ్బెన మండల జడ్పీటీసీ బాబురావ్‌, గోలేటి గ్రామ సర్పంచ్‌ తోట లక్ష్మణ్, గోర్కా ఫౌండేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

అక్రమంగా తరలిస్తున్న 15టేకు దుంగలు స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న 15 టేకు దుంగలు స్వాధీనం

శనివారం రాత్రి ఇండికా కారులో ( ఏపీ15బీఎమ్6848)అక్రమంగా తరలిస్తున్న 15 టేకు దుంగలను రెబ్బెన  మండలలంలోని సోనాపూర్ శివారులోని బ్రిడ్జి వద్ద  స్వాధీనం చేసుకున్నామని, ఇద్దరు దుండగులు  పారిపోయారని డీవైఆర్వో కె. శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. డీ. ఎఫ్ . వో వెంకటేశ్వర్లు తెలిపన సమాచారంతో డీ,వై,ఆర్వో కె. శ్రీనివాస్‌ పక్కా ప్రణాళికతో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ సుమారు 18850 రూపాయలు ఉంటాయని పేర్కొన్నారు. కలప దొంగలపై నిఘా ఉంచుతామని తెలిపారు. నిందితులను పట్టుకుని వారిపై కేసులు నమోదు చేస్తామని, కలపతో కూడిన  ఇండికా  కారుని అదుపు లోకి తీసుకున్నామని తెలిపారు  . ఈ  సమావేశంలో  బీట్‌ అధికారులు ఎండీ అజరుద్దీన్‌, లత, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Friday, 21 August 2015

నార్లాపూర్ నుండి కిష్టాపూర్ మట్టి రోడ్డు చినుకు పడితే చిత్తడే

నార్లాపూర్ నుండి కిష్టాపూర్ మట్టి రోడ్డు చినుకు పడితే చిత్తడే

రెబ్బెన మండలంలోని నార్లపూర్ నుండి కిష్టాపూర్ వెళ్ళే దారి తారు రోడ్డు మంజూరు కాగా కాంట్రాక్టర్ నిర్లక్షంతో పనులు వేగవంతం చేయకుండా మట్టి వేయడంతో వర్షం రావడంతో చిత్తడే చిత్తడి అయ్యి కాలినడకన వెళ్ళేటట్లు లేదు. రెండు రోజుల నుండి వర్షం రావడంతో సదరు కాంట్రాక్టర్ రోడ్డుపై మొరం వెయ్యడంతో ఆ రోడ్డుకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉన్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్షం తోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రజలు అంటున్నారు. ఉదయం పూట చిన్న పిల్లలు పాటశాలలకు వెళ్ళే బస్సులు కూడా రావడానికి వీకు లేకుండా ఉంది. రోడ్డు ఇలా ఉండడంతో పిల్లల చదువులకు ఇబ్బంది కలుగుతుందని వాపోతున్నారు. వర్షాకాలం విషజ్వరాలు వస్తుండడంతో ఆసుపత్రికి వెళ్ళడానికి వీలు లేకపోవడంతో ప్రజలు అంటున్నారు. వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తారు రోడ్డు వేయించగలరని గ్రామంలోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అవినీతి సర్పంచ్ తొలగింపు

అవినీతి సర్పంచ్ తొలగింపు

గత కొంత కాలంగా గ్రామా పంచాయితి నిధులను స్వాహా చేసిన కేసులో నారాయణపూర్ గ్రామ సర్పంచ్ వేమునూరి వెంకటేశ్వర్లును సర్పంచ్ పదవి నుండి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారి చేశారు, గ్రామ పంచాయితి నిధులు 118809/- సర్పంచ్ నిధులు కాజేసినందుకు సస్పెండ్ ఉత్ర్తర్వులు జారీచేసి, ఉపసర్పంచ్  ఎరవోతుల పద్మకు ఇంచార్జీ ఇచ్చినట్లు ఉత్తర్వులు అందినట్లు ఎం,పీ,డీ,వో ఎం ఎ హలీం తెలిపారు.

నిరక్షరాస్యత నిర్మూలనే సాక్షర భారత్-సాక్షర భారత్ కో.ఆర్డినేటర్ సాయి బాబా

నిరక్షరాస్యత నిర్మూలనే సాక్షర భారత్-సాక్షర భారత్ కో.ఆర్డినేటర్ సాయి బాబా


సాక్షర భారత్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు సార్వత్రిక విశ్వవిద్యాలయ పరీక్ష నిర్వహిస్తున్నామని సాక్షర భారత్ కో.ఆర్డినేటర్ సాయి బాబా అన్నారు. గురువారం నాడు మండల పరిషత్ కార్యాలయంలో సాక్షర భారత్ గ్రామా సమన్వయకర్తలకు సార్వత్రిక విశ్వవిద్యాలయ పరీక్షకు సంబంధించిన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనమ మాట్లడుతూ ఆదివారం నాడు ఈ పరిక్ష ఉదయం 10 గంటల నుం నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నామని అన్నారు. తెలుగు రాయడం మరియి చదవడం వచ్చినవారు ఎవరైనా ఈ పరిక్షను రాయవచ్చు అని తేలిపారు.

మద్యం వద్దు మంచి నీరు కావలి

మద్యం వద్దు మంచి నీరు కావలి-పేదలను మోసం చేస్తున్న ప్రభుత్వం జిల్లా మహిళా అధ్యక్షురాలు 


 ప్రభుత్వం రాష్ట్రంలో జిల్లాలోని అన్ని మండలాలలో ఒక మద్యం దుకాణం విధానాన్ని వ్యతిరేకిస్తూ మద్యం వద్దు మంచీనీరు కావాలి అనే పలు డిమాండ్లతో కూడిన వినతీ పత్రాన్ని తెలుగు దేశం జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి రెబ్బెన  మండల తహశిల్దార్ రమేష్ గౌడ్ కు అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కే,జీ, టూ పీజీ విద్యను అమలు చేయాలని, ఆహార భద్రత కార్డుల విషయంలో ప్రజలు ప్రతినేల ఇబ్బంది పడుతున్నారని, ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు తగ్గించాలని, చౌక ధరల దుకాణాలలో ఉల్లిగడ్డలు సరఫరా చేయాలని, డ్వాక్ర మహిళల రుణాలు మాఫీ చేయాలని,మహిళలపై దాడులను అరికట్టాలని, మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలాని, మండలానికో మహిళ పోలిస్ స్టేషన్ కావాలని అన్నారు. ఈ కార్యాక్రమంలో తెలుగు దేశం జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు గజ్జల అనసూర్య, మండల మహిళా అధ్యక్షురాలు కాసర్ల లక్ష్మి, గోలేటి పట్టణ అధ్యక్షురాలు కాజల్ బిస్వాస్, మండల తే,దే,పా అధ్యక్షులు, రెబ్బెన గ్రామ పంచాయితి ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, బొంగు నరసింగారావు తదీతరులు పాల్గొన్నారు.

నెలల నుండి అంధకారంలో గ్రామాలు

నెలల నుండి అంధకారంలో గ్రామాలు

గత కొన్ని నెలల నుండి విద్యుత్‌ సరఫరా లేక గ్రామాలు అంధకారంతో మగ్గుతున్నాయని నంబాల ఎం,పీ,టీ ,సి కొవ్వూరి శ్రీనివాస్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. రాత్రిపూట చిన్నపిల్లలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నామని. వర్షకాలం కావడం వల్ల మురికి కాలువులల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దోమలు విఫరీతంగా ఉన్నాయని ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్‌ లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురౌతున్నామని రెబ్బెన మండలంలోని నంబాల,కిష్టాపుర్‌, జక్కులపల్లి, నారాయణపుర్‌,గంగాపుర్‌,తుంగేడ,తక్కలపల్లీ గ్రామపంచాయితీల్లో విద్యుత్‌ సప్లై లేదని ప్రజలు ఆందోళ చెందుతున్నారని. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, నంబాలలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని గ్రామప్రజలు,రైతులు కోరుతున్నారు. ఈ సమావేశంలో ముంజం రవీందర్ గంగాపూర్ సర్పంచ్, గాజుల రవీందర్ పీఏసీ చైర్మన్, టీ పోతిరెడ్డి కిష్టాపూర్, పాలగొని పర్వతాలు మాజీ సర్పంచ్, లెండుగురె గంటుమేర మాజీ సర్పంచ్, ఎరువోతుల సుమన్ నారాయణపూర్, పీ మల్లారెడ్డి మాజీ సర్పంచ్, పూదరి వెంకటేష్ నారాయణపూర్, భానుప్రసాద్ నంబాల మాజీ సర్పంచ్, అనిశెట్టి వెంకన్నగంగాపూర్, గ్రామప్రజలు,రైతులు తదీతరులు పాల్గొన్నారు.

Thursday, 20 August 2015

భక్తిశ్రద్దలతో నాగుల పంచమి

భక్తిశ్రద్దలతో నాగుల పంచమి


నాగుల పంచమి సందర్భంగా బుధవారం మండలంలో మహిళలు నాగుల పంచమి భ క్తి శ్రద్దలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్బంగా పుట్టలో పాలు పోసి నాగదేవతకు పూజలు నిర్వహించారు.

Wednesday, 19 August 2015

నవేగాం లో పారిశ్యుద్ధం కార్యక్రమం

నవేగాం లో పారిశ్యుద్ధం కార్యక్రమం




అభివృద్దే లక్ష్యంగా గ్రామజ్యోతి పథకం ప్రవేశపెట్టడం జరిగిందని ఎం,పీ,డీ,వో  ఎం,ఏ హలీం అన్నారు. 17నుండి జరుగుతున్న గ్రామ జ్యోతిలో భాగంగా  రెబ్బెన మండలంలోని నవేగాంలోని జడ్పీఎస్ఎస్ ఆవరణలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా నవేగాంలో  యువత ఎక్కువగా ఉందని, చాలా ఉత్సాహంతో సహకరించాలని  ఎం,పీ,డీ,వో  ఎం,ఏ హలీం అన్నారు, ఈ కార్యాక్రమంలో పాటశాల చైర్మన్ అక్కేనపల్లి సుబాష్, గ్రామంలోని యువత, ప్రజలు  పాల్గొన్నారు.


మైనార్టీల సంక్షేమానికి చెక్కు ప్రధానం- ఎంఎల్ఏ కోవ లక్ష్మి

మైనార్టీల సంక్షేమానికి చెక్కు ప్రధానం


రెబ్బెన మండలంలోని మైనార్టీలకు ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎంఎల్ఏ  కోవ లక్ష్మి 20,000 చెక్కు ప్రధానం చేశారు,ఈ కార్యక్రమంలో తూర్పు జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ జైశ్వాల్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు చోటు, జహీర్ బాబా, జబి,జామా మస్జీద్ కమిటీ సభ్యులు, ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్,వైస్ ఎంపీపీ రేణుక, జడ్పిటీసి బాబురావు, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ తదీతరులు పాల్గొన్నారు.

గ్రామ జ్యోతి కార్యక్రమంలో పారిశ్యుద్ధం- ఎంఎల్ఏ కోవ లక్ష్మి




తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతీష్టాత్మకంగా చేపట్టిన గ్రామ జ్యోతి కార్యాక్రమం ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎంఎల్ఏ  కోవ లక్ష్మి ఆధ్వర్యంలో రెబ్బెన గ్రామ పంచాయితోలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి, బుధవారం నాడు గ్రామ జ్యోతి  పారిశ్యుద్ధం కార్యక్రమంలో భాగంగా రెబ్బెనలోని వీదులలో రోడ్లకు ఇరువైపులా ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను  తొలగించారు, రోడ్లపై ఉన్న చెత్తను తొలగించి బ్లీచింగ్ పౌడర్ ను చల్లారు, గ్రామంలోని అన్ని బావులలో బ్లీచింగ్ పౌడర్ ను చల్లారు,ఈ కార్యక్రమంలో రెబ్బెన యువకులు,ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్,వైస్ ఎంపీపీ రేణుక, జడ్పిటీసి బాబురావు,తూర్పు జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ జైశ్వాల్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ,మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి,రెబ్బెన టౌన్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్, ప్రభుత్వ అధికారులు,ప్రజా ప్రతినిధులు,గ్రామ ప్రజలు, తదీతరులు పాల్గొన్నారు.

మధ్యాహ్నా భోజన పథకాన్ని పరిశీలించిన ఎం,పీ,డీ,వో

మధ్యాహ్నా భోజన పథకాన్ని పరిశీలించిన ఎం,పీ,డీ,వో

రెబ్బెన మండలంలోని నవేగాంలో జడ్పీఎస్ఎస్ లో ఎం,పీ,డీ,వో  ఎం,ఏ హలీం మధ్యాహ్నా భోజన పథకాన్ని పరిశీలించారు, ఈ కార్యక్రమంలో పాటశాల చైర్మన్ అక్కేనపల్లి సుబాష్,పాటశాల ప్రధానోపాధ్యాయుడు దేవుల నాయక్ పాల్గొన్నారు.

Tuesday, 18 August 2015

ఇండియా నెంబర్ వన్ యాప్ --జియో

వాట్సాప్‌కి పోటీగా జీయో విత్.. సరికొత్త యాప్

- రిలయన్స్ నుంచి సరికొత్త మొబైల్ యాప్
- ఆడియో, వీడియా షేరింగ్ ఆప్షన్
- న్యూస్ అప్‌డేట్స్ సైతం..ఆసక్తి చూపుతున్న యూత్
         

Whats App Vs jio chat

    డిజిటల్ ఇండియాలో భాగంగా రిలయెన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ ప్రవేశపెట్టిన  జియో చాట్ యాప్
ఇండియా నెంబర్ వన్ యాప్ గా  అభివృద్ధి చెందుతుంది. ఆధునిక  టేక్నోలోజి యుగంలో స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ఎస్‌ఎంఎస్‌లు, ఈ మెయిల్స్ కె పరిమితం కాకుండా సోషల్ మీడియా మాధ్యమాలకు క్రేజ్ పెరిగింది. మార్కెట్‌లోకి రోజుకో మొబైల్ యాప్ వస్తోంది. టెక్స్ మెసేజ్‌లకే పరిమితమైన జనానికి ఆడియోలు, వీడియోలు సైతం షేర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తునాయి. అలా.. వాట్సప్, వైబర్, వియ్‌చాట్, హైక్ వంటి యాప్స్ కోట్లాది మంది వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి వాటికి దీటుగా రిలయెన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్  సరికొత్తగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల ముందుకు జియో చాట్ తెచ్చింది.  

                ఆండ్రాయిడ్ మొబైల్స్ చాటింగ్ కోసం వినియోగిస్తున్న వాట్సప్, లైన్, వైబర్, హైక్ వంటి అప్లికేషన్స్ సరసన సరికొత్తగా  జియోచాట్ వచ్చి చేరడంతో వాట్సప్ మాదిరి ఉచితంగా  ఆత్మీయులతో సంభాషించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇటీవలే రిలయెన్స్ విడుదల చేసిన ఈ మొబైల్ యాప్‌లో ఆడియో, వీడియో చాట్‌తో  పాటు గ్రూప్ చాటింగ్‌కి కూడా అవకాశం కల్పించడం విశేషం.
                  ఒకేసారి ఎక్కువమందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం వుంది
జియో-యాప్ ఎమోషన్స్, డూడెల్స్ పంపించుకోవచ్చు. వీడియో, లోకేషన్ కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంది.
వాట్సప్‌తో పోల్చితే జియో అదనపు ఆప్షన్స్  మరియు  ఇది  మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్ కలిగి ఉండడం వల్ల భారతీయ వినియోగదారులు ఎక్కువగా ఇప్పుడు జియో వైపు ఆసక్తి చూపుతున్నారు  ప్లేస్టోర్ నుంచి  ఇ  యాప్ ని సులబంగా మరియు  ఫ్రీ  డౌన్లోడ్ చేసుకోవచ్చు.



12 గ్రామపంచాయతీలలో గ్రామజ్యోతి




రెబ్బెన మండలంలోని  12 గ్రామపంచాయతీల పరిధిలో ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్యాలయాల్లో గ్రామసర్పంచ్‌ ల ఆధ్వర్యంలో గ్రామజ్యోతి కార్యక్రమం ను నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాలల విద్యార్థుల చే ర్యాలీలు, మానవహారాలు నిర్వహించి గ్రామజ్యోతి పథకం గురించి వివరించడం జరిగింది. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో రెబ్బెన  సర్పంచ్‌ పెసరి. వెంకటమ్మ గ్రామ పంచాయితి కార్యాలయం నుండి బి.సి. హాస్టల్ వరకు  కాలువలకు ఇరువైపుల ఉన్న పిచ్చి మొక్కలను తీసివేసారు. నంబలలో సర్పంచ్‌ గజ్జెల సుశీల ఆధ్వర్యంలో రోడ్డుకి ఇరువైపులా ముండ్ల పొదలను నరికివేసారు. గోలేటిలో రమణారెడ్డి నగర్ మరియు దళితవాడలలో సర్పంచ్‌ తోట . లక్ష్మణ్  ఇంటింటా సమస్యలను అడిగి తెలుసుకొని పలు వాడలలో చేత్తను శుబ్ర పరచారు. ఖైరగామలో రెబ్బెన తహసిల్దార్ రమేష్ గౌడ్ రోడ్డు పక్కనున్న పిచ్చి మొక్కలను, మురికి కాలువల శుబ్రం చేసారు. మురికి కాలువలలో నుండి నీరు బావిలోకి కలుస్తుందని వాటిని నివారించారు.   ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి పథకం లో అందరూ భాగస్వామ్యం పంచుకోవాలని అలాంటప్పుడే గ్రామాలు అభివృద్ది దిశగా ప్రయానించి కేసీఆర్‌ లక్ష్యం నెరవేరుతుందని ఆయన అన్నారు. అనంతరం గ్రామ పంచాయతీలో గ్రామ అభివృద్దికి సంబంధించిన కమిటీ మెంబెర్లు,  కార్యక్రమంలో ఆయా గ్రామాల ఎంపీటీసీలు, ఉపసర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, సాక్షరభారతీ కోఆర్డినేటర్లు, కార్యదర్శులు, కారోబార్లు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 365జయంతి ఘన వేడుకలు

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 365జయంతి ఘన వేడుకలు  


రెబ్బెన లోని అర్అండ్ బీ అతిదీ గృహంలో మంగళవారం నాడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 365 జయంతి పురస్కరించుకొని  జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణా గౌడ సంఘ జిల్లా ఇంచార్జి కే.అంజనేయుల గౌడ్ మాట్లాడుతూ  ఆనాటి మొగలుల కలం లో పంటల పై వేసే పన్ను కంటే కళ్ళు పై వేసే పన్ను అధికంగా ఉండేదని ఆనాడు బి.సి కులాలు దళిత వర్గాలు ఏకం చేసి జమిందారులు, సుబెదరులు ఎదురుతిరిగి పోరాటం చేసిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్న ది  అన్నారు.ఈ  కార్యక్రమం లో ముక్య అతిధి గా ఎం పి పి సంజీవ్ కుమార్ మరియు తహసీల్దార్ రమేష్ గౌడ్ ఆసిఫాబాద్ నియోజక ఇంచార్జి  ఎం,సుదర్శన్ గౌడ్, అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్ ,కొయ్యడ రాజగౌడ్ ,మోడెమ్ చిరంజీవి గౌడ్,మడ్డి శ్రీనివాస్ గౌడ్,సర్వేశ్వర్ గౌడ్,శాంతి గౌడ్,లక్ష్మి నారాయణ గౌడ్,నవీన్ జైశ్వాల్,కుందారపు శంకరమ్మ, తెదెపా జిల్లా అద్యక్షురాలు సొల్లు లక్ష్మి ,   బొంగు నరసింగ రావు,అజయ్ జైశ్వాల్ తదితర గౌడ నాయకులు పాల్గొన్నారు.

Monday, 17 August 2015

రెబ్బెనను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా -ఎంఎల్ఏ కోవ లక్ష్మి

రెబ్బెనను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా  -ఎంఎల్ఏ  కోవ లక్ష్మి




రెబ్బెన గ్రామానికి అన్ని మౌలిక వసతులు కల్పించి జిల్లా లోనే ఆదర్శ గ్రామంగా  తీర్చి దిద్దుతానని  ఆసిఫాబాద్ ఎంఎల్ఏ  కోవ లక్ష్మి అన్నారు,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతీష్టాత్మకంగా చేపట్టిన గ్రామ జ్యోతి కార్యాక్రమాన్ని విజయవంతం చేయాలని సోమవారం నాడు ఆసిఫాబాద్ ఎంఎల్ఏ  కోవ లక్ష్మి రెబ్బెనలో అన్నారు, రెబ్బెన గ్రామాన్ని దత్తతగా తీసుకొని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు, ఆమె మాట్లాడుతూ రెబ్బెనను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికే దత్తతగా తీసుకొన్నానని అన్నారు,రెబ్బెనలో సి,సి, రోడ్లు,మురికి కాలువలు లేక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారని అన్నారు, ఆసిఫాబాద్ లో 5సం. అభివృద్ధిని 1సం,లోనే సాధించామని, మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని అలాగే రెబ్బన లోని సి,సి, రోడ్లు, డ్రైనేజిలు తదితర సమస్యల్ని 4సం, లో పరిష్కరిస్తానని అన్నారు,ప్రజలు కమిటి వేయడానికి పూర్తి సహకారం అందించాలని అన్నారు,రెబ్బెనలో యువత ఎక్కువగా ఉందని, చాలా ఉత్సాహంతో సహకరిస్తారని ఆమె తెలిపారు, నాయకులందరు  పార్టీ లకు అతీతంగా అందరు సహకరిస్తేనే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దవచ్చని అన్నారు, కళ్యాణ లక్ష్మి,ఆసరా,ఆహార భద్రత పధకాలు పెదవారికే అందేలా అధికారులు చూడాలని ఆమె అన్నారు.ప్రత్యేక అధీకారి ఏపీఎమ్ రాజ్ కుమార్ కార్యక్రమంలోని వారికి ముఖ్య మంత్రి గారి ప్రసంగాన్ని వెల్లడించారు అనంతరం రెబ్బెన గ్రామ పంచాయితిని దత్తత తీసుకున్న సందర్భంగా ఎంఎల్ఏ  కోవ లక్ష్మికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్,వైస్ ఎంపీపీ రేణుక, జడ్పిటీసి బాబురావు,ఎమార్వో రమేష్ గౌడ్,ఎంపీడీవో హలీం,ఎంఈవో వెంకటేశ్వర స్వామి,ప్రభుత్వ అధికారులు,ప్రజా ప్రతినిధులు,గ్రామ ప్రజలు, తదీతరులు పాల్గొన్నారు,




మండల ఎం,ఈ,వో గా వెంకటేశ్వర స్వామి

మండల ఎం,ఈ,వో గా వెంకటేశ్వర స్వామి



రెబ్బెన మండల ఎం,ఈ,వో గా వెంకటేశ్వర స్వామి  సోమవారం నాడు భాధ్యతలు చేపట్టారు. ఈయనకు పీఆర్టీయు సంఘం వారు స్వాగతం పలికారు,గతంలో దహేగాం మండల ఎం,ఈ,వో గా పనిచేసి బదిలీపై రెబ్బెన మండలానికి వచ్చారు,  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని పాటశాలల్లో సమష్యలు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పిస్తానని అన్నారు, మండలంలో అన్ని పాటశాలలను సందర్శిస్తానని, ఏవైనా సమష్యలను కనబడితే సత్వరమే పరిష్కరిస్తాని తెలిపారు. ఈ కార్యాక్రమంలో పీఆర్టీయు ప్రెసిడెంట్ ఎస్,కే ఖాదర్, డీ,రవికుమార్, బత్తుల సదానందం, తదీతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా గ్రామజ్యోతి

తెలంగాణ రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా గ్రామజ్యోతి


 తెలంగాణ రాష్ట్రప్రభుత్వం పల్లెల అభివృద్దే లక్ష్యంగా భావించి రాష్ట్ర ముఖ్యమంత్రి కే,సి,ఆర్  గ్రామజ్యోతి పథకం ప్రవేశపెట్టారు. రెబ్బెన మండలంలోని నంబాల గ్రామ పంచాయితీలో  ఈ గ్రామ జ్యోతి కార్యాక్రమాన్ని నిర్వహించారు,  గ్రామజ్యోతి పథకంలో గ్రామంలోని ప్రతి ఒక్కరు తమవంతు బాద్యతగా భావించి సహకరించినప్పుడే గ్రామాలు అభివృద్ది చెందుతాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అంగన్వాడి కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sunday, 16 August 2015

16-08-15

పరిసరాలు శుభ్రంగా ఉంటె రోగాలు దరి చేరవు


ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరి చేరవని జిల్లా వైధ్యదికారిని డా, రుక్మిణమ్మ అన్నారు ఆదివారం నాడు వైద్య  బృందంతో రెబ్బెన మండలంలోని తుంగేడ లో సందర్శించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షా కాలం  కావడం తో గ్రామా ప్రజలు  త్రాగే నీరు వేడి చేసుకొని చల్లారిన తరువాత త్రాగాలని, పరిశుభ్రత పాటించాలని,కాలువలను శుభ్రంగా ఉంచాలని అన్నారు, దొమలు,ఈగలు లేకుండా చేయాలని సూచిచారు, జ్వరం వచ్చిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని అన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియ వైద్యాధికారి డా,రవి,  డా,సుధాకర్ నాయక్, వైద్య సిబ్బంది సుధాకర్,కరుణాకర్,తులసి, ఏఎన్ఎం లు పద్మ, విజయ లక్ష్మి పాల్గొనారు.

అటవీ శాఖ మంత్రిచే ఉత్తమ సేవ పురస్కారం అందజేత

అటవీ శాఖ మంత్రిచే ఉత్తమ సేవ పురస్కారం అందజేత

69వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విధి నిర్వాహణలో భాగంగా అంకిత భావంతో సేవ చేసిన కే,రాజ్ కుమార్ ఏపీఎం డీఆర్డీఏ రెబ్బెన గారికి ఉత్తమ సేవ పురస్కారం మరియి ప్రశంసా పత్రాన్ని గౌరవ అటవీ శాఖ మంత్రి జాగు రామన్న గారి చేతుల మీదగా 15ఆగస్టు రోజున జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది. గతంలో కూడా 2005 జనవరి 26 న శేషాద్రి నాయుడు ప్రాజెక్ట్ అధికారి ఐ,టీ,డీ,ఏ ఉట్నూర్, అలాగే 26 జనవరి 2013 లో కలెక్టర్ అశోక్ గారి చేతుల మీదగా అందుకున్నారు.

Saturday, 15 August 2015

15th Aug 2015

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకంక్షలు 


రెబ్బెన మండలంలోని ప్రజలకు,ప్రజాప్రతినిధులకు మరియి ప్రభుత్వ అధికారులకు మండల ప్రజలకు వుదయం దిన పత్రిక తరుపున హృదయ పూర్వక  69వ స్వాతంత్ర్య దినోత్సవ  శుభాకంక్షలు. మన వార్తలను ఆదరిస్తున్న ప్రజానికానికి అందరికి ధన్యవాదాలు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

పోలీసుస్టేషన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు



రెబ్బెన మండలంలోని  పోలీసుస్టేషన్‌లో  69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఎస్సై హనుఖ్‌ సిబ్బందితో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్సై మిరాజోద్దీన్‌, శ్రీనివాస్‌ , పోలీసులు వీరస్వామి,హెడ్‌కానిస్టేబుల్‌  రాజయ్య, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు

జెండా ఆవిష్కరణ


 టీ,ఆర్,ఎస్ నాయకుల జెండా ఆవిష్కరణ వేడుకలు

రెబ్బెన మండలంలోని ప్రయాణ ప్రాంగాణం ఆవరణలో టీ,ఆర్,ఎస్ పార్టీ రెబ్బెన టౌన్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రెబ్బెన ప్రజలకు ఆయన ఈ సందర్భంగా 69వ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తూర్పు జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ జైశ్వాల్, వైస్ ఎంపీపీ గోడుసేల రేణుక, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ,మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి,మండల యూత్ ప్రెసిడెంట్ వెంకట్రాజం,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, ,టి,ఆర్,ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ఎంపీడీఓ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ


ఎంపీడీఓ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

రెబ్బెన మండలంలోని 69వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఎంపీపీ కార్నధం సంజీవ్ కుమార్ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ  ఎంఎ హలీం,ఎమార్వో రమేష్ గౌడ్,జడ్పిటిసి బాబురావు తదితర ప్రజా ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది  పాల్గొన్నారు.

తహసీల్దార్‌ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ వేడుకలు

తహసీల్దార్‌ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ వేడుకలు




రెబ్బెన మండలంలోని తహశిల్దార్ కార్యలయంలో  శనివారం ఎమార్వో రమేష్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు ఆయన ఈ సందర్భంగా 69వ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రగతికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి ఎస్సై సిఎచ్ హనూక్ ఆధ్వర్యంలో  భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు,ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ  ఎంఎ హలీం,ఎంపీపీ కార్నధం సంజీవ్ కుమార్.జడ్పిటిసి బాబురావు తదితర ప్రజా ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది  పాల్గొన్నారు.

వైద్యసిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

రెబ్బెన రూరల్‌ : మండలంలోని ప్రభుత్వ వైద్యశాలలో 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో డాక్టర్‌ సరస్వతీ పతాకాన్ని ఆవిష్కరించారు. హెల్త్‌ అసిస్టెంట్‌ కమలాకర్‌, సూపర్‌వైజర్‌ లక్ష్మీ, సుధాకర్‌లు ఎఎన్‌ంలు ప్రమీల, ఉమాదేవి, లలిత రాజేశ్వరీలు పాల్గొన్నారు

Friday, 14 August 2015

14-08-2015

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 365జయంతి గోడ ప్రతుల విడుదల 


రెబ్బెన లోని అర్అండ్ బీ అతిదీ గృహంలో శుక్రవారం నాడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 365 జయంతి పురస్కరించుకొని 16-08-2015 ఆదివారం నాడు రవీంద్రభారతిలో జరిగే జయంతి వారోత్సవాల గోడ ప్రతులను విడుదల చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెబ్బెన మండలంలోని గౌడ జనులందరు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయగలరని కోరారు, ఈ  ప్రతులను జిల్లా ఇంచార్జి కే,అంజనేయుల గౌడ్, ఆసిఫాబాద్ నియోజక ఇంచార్జి  ఎం,సుదర్శన్ గౌడ్, అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్ ,కొయ్యడ రాజగౌడ్ ,మోడెమ్ చిరంజీవి గౌడ్,మడ్డి శ్రీనివాస్ గౌడ్,సర్వేశ్వర్ గౌడ్,శాంతి గౌడ్,లక్ష్మి నారాయణ గౌడ్,నవీన్ జైశ్వాల్,కుందారపు శంకరమ్మ,నరసింగ రావు,అజయ్ జైశ్వాల్ తదితర గౌడ నాయకులు పాల్గొన్నారు.

14-08-2015

తుంగేడలో వైద్య శిభిరం 

రెబ్బెన మండలంలోని తుంగెడలో డాక్టర్‌ సరస్వతి ఆధ్వర్యంలో వైద్య శిభిరాన్ని నిర్వహించారు. ఈ శిభిరంలో గ్రామం లోని ప్రజలకు టైఫాయుడ్ మరియు మలేరియ  వైద్య  పరిక్షలు నిర్వహించారు, ఇందులో  14 మందికి మూత్ర,రక్త పరిక్షలు నిర్వహించగా అందులో ప్రవీణ్, శ్రీను,కమలాకర్,పావని,తులసి,ఆశ మందికి మలేరియాను నిర్ధారించారు వారికి మందులను పంపిణి చేశారు, గ్రామా ప్రజలకు వర్షాకాలం కావడం వాళ్ళ త్రాగే నీరు వేడి చేసుకొని త్రాగాలని, పరిశుభ్రత పాటించాలని సూచిచారు,

14-08-15

గ్రామపంచాయితి సెక్రటరీకి ఆటో యూనియన్ వినతీ పత్రం


రెబ్బెన మండలంలోని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రెబ్బెన గ్రామపంచాయితి సెక్రటరీ రవీందర్కి వినతీ పత్రాన్ని అందజేశారు,ఈసందర్భంగా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ బొంగు నర్సింగారావు మాట్లడుతూ ఆటో స్టాండ్ ఆవరణలో మొత్తం బురదమయంగ మారిందని, ఆటోలను నడపడానికి వీలులేకుండా వుందని, చెత్తాచెదారం పేరుకు పోయి ఈగలు,దోమలు వ్యాపించడంతో ప్రయాణికులు ఆటో స్టాండ్ కు రావడానికే తీవ్రఇబ్బంది పడుతున్నారని వాపోతున్నారు, వెంటనే మొరం పోయించి పరిసరాలను శుభ్రం చేయాలని కోరారు. ఈ వినతీ పత్రాన్ని మోడెం రాజ గౌడ్, జీ,రమనయ్య, కోత్వం శ్రీనివాస్, ఆర్,శంకర్, ఈ,మహేష్, కే,మల్లేష్, నాగరాజు,నరేష్, ఆటో యూనియన్ నాయకులు పాలోన్నారు.

Thursday, 13 August 2015

డిప్యూటి తహశిల్దార్ కు డెల్ ట్యాబ్ అందజేత


రెబ్బన మండలంలోని తహశిల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ రమేష్ గౌడ్ గురువారం నాడు డిప్యూటి తహశిల్దార్ రామ్మోన్మోహన్ కు డెల్ ట్యాబ్ ను అందజేశారు, ఈ సందర్భంగా ఎంఆర్ఓ రమేష్ గౌడ్ మాట్లడుతూ మండలం లోని ప్రజలకు మరియి రైతులకు మరిన్ని సేవలను త్వరితగతిన అందించాలని అన్నారు.

ఆధార్ అనుసంధానం నమోదు చేసుకోవాలి- తహశిల్దార్


ఆధార్  కార్డు అనుసంధానంతో పట్టా పాస్ బుక్కులు ఆన్ లైన్ లో చేసుకోవాలని రెబ్బెన మండల తహశిల్దార్ రమేష్ గౌడ్ తెలిపారు, గతంలో ఆన్ లైన్ చేసుకొని రైతులు వెంటనే ఆన్ లైన్ లో చేసుకోవాలని అన్నారు. దూర ప్రాంతంలో ఉన్న రైతులు చరవాణీ ద్వారా సందేశం గాని,సంభాసన ద్వారా గాని చెప్పాలని అన్నారు.చరవాణీ నెంబర్ ఆర్ఐ బక్కయ్య :9849590723, ఖైర్గాం వీఅర్ఓ సంతోష్-9640554689,  గంగాపూర్ వీఅర్ఓ జయలక్ష్మి-9441426577, వంకులం,తక్కలపల్లి వీఅర్ఓ వాసుదేవ్-9951092573, కిష్టాపూర్,గోలేటి, నారాయణపూర్ వీఅర్ఓ ఆశీర్వాదం-9492129409

Wednesday, 12 August 2015

మహాసభల గోడ ప్రతుల విడుదల


రెబ్బెన మండలంలోని గోలేటిలో బుధవారం నాడు ఏ,ఐ,టీ,యు,సి నాయకులు మహేంద్ర భవనంలో ఈనెల 16న కొత్తగుడెంలో జరిగే తెలంగాణా రాష్ట్ర మొదటి మహాసభల గోడ ప్రతులు విడుదల చేశారు,ఏ,ఐ,టీ,యు,సి బ్రాంచ్ సెక్రెటరీ బోగే ఉపెంధర్ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం  కాంట్రాక్ట్ కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ శ్రమ దోపిడి చేస్తున్నారని అన్నారు, ఈ సభలో భవిషత్ కార్యచరణ రూపొందించి తీర్మానం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు , ఏరియా లోని కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలనీ కోరారు, ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు రామస్వామి కార్యదర్శి సీఎచ్ అశోక్, సహాయ కార్యదర్శి మొగిలి,నాయకులు వెంకన్న,సుధాకర్, రమేష్,శేఖర్,రాజ్ కుమార్,తదితర నాయకులు పాల్గొన్నారు

మరింత చేరువగా ఐడియా


రెబ్బెన మండలంలో నూతనంగా జెకెఎల్ ఏజెన్సీ వారు ఐడియా పాయింట్ ప్రారంభించారు, ఐడియా జడ్పీఎం రియాజ్ మాట్లాడుతూ వినియోగదారులకు అందుబాటులో మరింత చేరువగా ఉండటానికి ప్రారంభించామని, 3G సేవలను కస్టమర్లు ఉపయోగించుకోవాలని, ఇతర నెట్ వర్క్స్ కు దీటుగా సేవలందిస్తామని అన్నారు, ఈ ప్రారంభోత్సవంలో ఐడియా పాయింట్ ZSM బద్రి,ASM కమలాకర్,TSC సయిద్,రెబ్బెన డిస్ట్రిబుటర్ లోకేష్, మండలంలోని రిటైలర్లు, వినియోగదారులు పాల్గొన్నారు,

Monday, 10 August 2015

గోలేటి టౌన్ షిప్ లో ఆయుర్వేద వైద్య శిభిరం


పారిశ్రామిక ప్రాంతమైన రెబ్బెన లోని  గోలేటి టౌన్ షిప్ లో సోమవారం ఆయుర్వేద వైద్య శిభిరం నిర్వహించారు, వైద్యుడు మహర్షీ రోగులకు వైద్య సేవలు చేసి మందులు పంపిణి చేశారు, ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.