Wednesday, 15 July 2015

క్విజ్‌ పోటీలలో విద్యార్థికి బహుమతి ప్రదానం



రె బ్బెన: హరితహారంలో భాగంగా సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్‌ పోటీలలో రెబ్బెన మండల కేంద్రంలోని సాయి విద్యాలయం, ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఎం. సాయికిరణ్‌ ద్వితీయ బహుమతి సాదించినట్లు కరస్పాండెంట్‌, ప్రధానోపాద్యాయులు సంజీవ్‌కుమార్‌ తెలిపారు. బహుమతిని రెబ్బెన ఎంపీపీ స ంజీవ్‌కుమార్‌, జడ్పీటీసీ బాబురావు, రెబ్బెన సర్పంచ్‌ వెంకటమ్మలు అందజేశారు.  ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ శ్రీధర్‌ కుమార్‌, పాఠశాల కరస్పాండెంట్‌ సంజీవ్‌కుమార్‌, తెదేపా మండల అధ్యక్షులు సుదర్శన్‌గౌడ్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌ మదనయ్య, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment