Saturday, 18 July 2015

పదహేడవ రోజుకు చేరింది. పంచాయితి కార్మికులు సమ్మె



గ్రామా పంచాయితీ ఉద్యోగుల సమ్మె  శుక్రవారానికి రెబ్బెన మండలంలో పదహేడవ రోజుకు  చేరింది. పంచాయితి కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని తహశిల్దార్ కార్యాలయం ముందు ప్రధాన రహదారి మీద  ధర్నా చేశారు, పరిష్కరించే వరకు నిరవదిక సమ్మె చేపడుతామని  అన్నారు. ఈ ధర్నాలో మద్దతుగా  వామపక్ష   నాయకులు బైటాయించారు, టిడిపి మహిళా  జిల్లా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి, సీపిఐ జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపెంధర్ మాట్లాడుతూ    ప్రస్తుతం గ్రామ పంచాయితీలలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగ,కార్మికులను పర్మినెంటు చేయాలని కార్మికుల కనీసవేతనం పెంచాలని అన్నారు ప్రభుత్వం విఫలమైందని కేసిఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు   కార్యక్రమంలో టిడీపి మండల అధ్యక్షుడు మోడెమ్ సుదర్శన్ గౌడ్, రాజ గౌడ్, బొమ్మినేని శ్రీధర్ ఎమ్మర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్,ఎమ్మర్పిఎస్ అధ్యక్షుడు బొంగు నర్సింగా రావు
సీపిఐ నాయకులు నర్సయ్య,సత్యనారాయణ,సీ.ఐ.టీ.యి. జిల్లా కార్యదర్శి నాగవెల్లి సుధాకర్, గ్రామా పంచాయితి జిల్లా ఉపాధ్యక్షుడు బాబాజి, మండల అధ్యక్షుడు జి. ప్రకాష్, డివిజన్ కమిటి సభ్యులు తిరుపతి, మండల ప్రచార కార్యదర్శి రత్నం విటల్, పంచాయితి కార్మిక సిబ్బంది పాల్గొన్నారు 

No comments:

Post a Comment