ఎ.పి.జె కు... జి పి కార్మికుల ఘన నివాళి
రెబ్బెన:గ్రామ పంచాయతీ కార్మికులు మంగళవారం ఉదయం మాజీ రాష్ట్రపతికి నివాళులు అర్పించారు. 11వరాష్ట్రపతిగా సేవలందించి, అణు రంగంలోని శాస్త్రవేత్తగా దేశానికి ఎన్నో సేవలందించిన
మిసేల్ మాన్ , భారతరత్న అవార్డు గ్రహిత అబ్దుల్ కలాం సోమవారం సాయంత్రం 6.30 గంటలకు మృతిచెందారని మన అందరికి విదితమే అని కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నాగవెల్లి సుధాకర్ అన్నారు. సమ్మె లో ఉన్నటువంటి గ్రామ పంచాయితి కార్మికుకులు ఆయన చిత్రపటానికి పూలమాలలతో శ్రద్దాంజలి ఘటించి, అనంతరం ఐదు నిమిషాలు మౌనం పాటించారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల సంఘo జిల్లా ఉపాధ్యక్షుడు
బాబాజీ, మండల అధ్యక్షుడు జి. ప్రకాష్, డివిజన్ కమిటీ సభ్యుడు డి.తిరుపతి, మండల ప్రచార కార్యదర్శి రత్నం విఠల్, లక్ష్మి, రాజమ్మ తదితర కార్మికులు పాల్గొన్నారు
No comments:
Post a Comment