Wednesday, 22 July 2015

మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభం


రెబ్బెన : మండలంలోని నంబాల గ్రామ పంచాయితీలో మిషన్‌ కాకతీయ పనులు బుధవారం పకీరుపల్లె చింతలచెరువులో ఎంపీపీ సంజీవ్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చెరవు పనులు సకాలంలో పూర్తి చేయాలని నాణ్యత లోపించరాదని కాంట్రాక్టర్‌ రవీందర్‌ కు విన్నవించారు. ఈ చెరవు వ్యయం 64 లక్షలతో ప్రారంభం చేశామన్నారు. ఈ కార్యక్రమలంలో జడ్పీటీసీ బాబురావు, నంబాల సర్పంచ్‌ గజ్జల సుశీల, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమ శేఖర్‌, డైరక్టర్‌ సత్తెన్న, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment