Wednesday, 22 July 2015

సింగరేణిలో క్రీడలకు అధిక ప్రధాన్యత


రెబ్బెన : సింగరేణిలో ఉత్పత్తి, ఉత్పాదకలతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుందని బెల్లంపల్లి ఏరియా జిఎం రవిశంకర్‌ అన్నారు. బుధవారం బెల్లంపల్లి తిలక్‌ స్టేడియంలో 30 వేణుగోపాల్‌ స్మారక రాష్ట్ర స్థాయి క్రికేట్‌ పోటీలను ప్రారంభించిన అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణి కార్మిక క్షేత్రంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ పాటవాలు కనబర్చే క్రీడాకారులకు కొదువ లేదని వారిని ప్రోత్సహిస్తే క్రీడారంగంతో అద్బుతాలు చేస్తాన్నారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు రాష్ట్ర వ్యాస్తంగా 8 జట్లు పాల్గొన్నాయి. ఈప్రారంభ కార్యక్రమంలో ఎస్‌ఓటు జిఎం, డివైజిఎం చిత్తరంజన్‌ కుమార్‌ పర్సనల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌, స్పోట్స్‌ సూపర్‌ వైజర్‌ రమేష్‌, సీనియర్‌ క్రీడా కారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment