Friday, 31 July 2015

విద్యుత్‌ ఘాతానికి విద్యార్థికి గాయాలు



రెబ్బెన : రెబ్బెన మండలానికి చెందిన ఆయిళ్ల సాయి విద్యుత్‌ షాక్‌ తగలడంతో పొట్ట, నడుము మీద గాయాలు అయ్యాయి. శుక్రవారం రాత్రి 7.30  సమయంలో సాయి బహిర్భూమికి వెళ్లి వస్తుండగా సబ్‌స్టేషన్‌ నుండి 11 కె.వి. కరెంటు తీగలు ఫంక్షన్‌ హాల్‌ ఏరియాలో విద్యుత్‌ ఘాతానికి గురై ఒళ్ళు కాలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విద్యార్థి అసిఫాబాద్‌ చైతన్య జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నట్లు సాయి తల్లిదండ్రులు తెలిపారు. విద్యుత్‌ ఘాతానికి గురైన సాయిని 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మండలంలో గత నెలలో విద్యుత్‌ ఘాతానికి గురై ఒకరు మృతి చెందగా, మరొకరు గాయాలు పాలైయ్యారు. మండలంలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇంకా ఎంతమంది ప్రాణాలను బలికొంటారని ప్రజలు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పంది ంచి ఇకనైనా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. 

No comments:

Post a Comment