Friday, 24 July 2015

విద్యారంగ సమస్యలు పరిస్కరించాలి


రెబ్బెన : మండలంలోని గురువారం బీ సీ వసతి గృహంలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో తెలంగాణ విద్యార్థిక వేదిక కార్యవర్గ సభ్యుడు బి. రాహుల్‌ ముఖ్య అతిథిగా హాజరైయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్‌ విద్యను రద్దు చేసి కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయాలని జీవో నెంబర్‌ 27 రద్దు చేయాలని అడవులపై ఆదివాసులకు హక్కుల కల్పించాలని, ఆసీఫాబాద్‌ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో టీవీవీ తూర్పు జిల్లా అధ్యక్షుడు కడతల సాయి , నాయకులు రవీందర్‌ , విజయ్‌,శ్రీనివాస్‌,గణష్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment