Thursday, 25 June 2015

ఇండ్లపై పడిన కరెంట్‌ వైర్లు



రెబ్బన: మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌ వెళ్లే రోడ్డువైపు గల ఇంద్రా కాలనీలో గల అప్సర్‌, గురువారెడ్డి, అబ్ధుల్‌, వైస్‌ ఎంపీపీ గొడిసెల రేణుకల మరియు గణేష్ పంతులు  ఇండ్ల మీద విద్యుత్‌ వైర్లు పడ్డాయి. దీంతో భారీ ఎత్తున మంటలు చెల రేగాయి. మధ్యాహ్న సమయం కావడం వల్ల జన సంచారం లేనందున పెద్ద ప్రమాదం తప్పింది. ఈ వైర్లను తొలగించాలని ఇండ్ల మధ్య ఉన్న 11 కేవీ కరెంట్‌ వైర్లను తొలగించాలని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య గురించి గతంలో ఎంపీడీవో కార్యాలయంలో ఆటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే కోవా లక్ష్మీలకు కూడా వినతిపత్రం అందజేశారు. అయినప్పటికీ విద్యుత్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో వైర్లు తమ ఇళ్ల మీద పడ్డాయని వారు వాపోయారు. అధికారులు స్పందించి వెంటనే ఆ వైర్లను తొలగించాలని కాలని వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

No comments:

Post a Comment