Sunday, 14 June 2015

ఆటో ఢీకొనడంతో ఇద్దరికి గాయాలు

రెబ్బెన  మండలం కేంద్రంలోని గోలేటి  గౌతంనగర్‌లో అతివేగంగా వస్తున్న ఎపీ1 డబ్ల్యూ 420 నంబర్‌ గల ఆటో డ్రైవర్ ఏమరుపాటు, అజాగ్రత్త వలన శనివారం రాత్రి కాలనీలో ఇంటి ముందు మంచం మీద కూర్చున వారిని ఢీకొట్టింది.దీంతో మంచంపై కూర్చున్న దుర్గం జాను కు తలకు గాయాలు కాగా, అతని  కూతురు  అంజలి చేతికి, నడుముకు గాయాలయ్యాయి. జాను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెబ్బెన  ఎస్సై హనోక్  తెలిపారు. 

No comments:

Post a Comment