Tuesday, 23 June 2015

హరితహారంపై అవగాహన సదస్సు


రెబ్బెన : రెబ్బన గ్రామ పంచాయతీలో గురువారం హరితహారంపై గురువారం మహిళ సంఘాల సభ్యులకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఎఎన్‌ఎంలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ పెసరు వెంకటమ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వం హరితహారం ద్వారా గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతి ఒక్కరు ఇంటి పరిసర ప్రాంతాల్లో, పోలాల గట్లపైన మొక్కలను నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.హరితహారంపై తీసువలసిన జాగ్రత్తలపై పలువురు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌ విండో డైరెక్టర్‌ మధనయ్య, కార్యదర్శి రవీంధర్‌, వార్డు సభ్యుడు చిరంజీవి, ఉపాధ్యాయుడు సదానందం, ఫారెస్ట్‌బీట్‌ అధికారి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment