Wednesday, 3 June 2015

తహశీల్‌ కార్యాలయంలో తెలంగాణ సంబరాలు

రెబ్బన: తహసీల్దార్‌ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సం దర్భంగా తహశీల్దార్‌ రమేష్‌గౌడ్‌ జాతీయ, తెలంగాణ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. జై తెలంగాణ జైజై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకటమ్మ, ఎంపీడీఓ అలీమ్‌, జడ్పీటీసీ బాబూరావు, ఎంపీపీ సంజీవ్‌కుమార్‌, ఏపీఎం రాజకుమార్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment