రెబ్బెన : మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల భవన నిర్మాణం కోసం ఆదివారం జడ్పీటీసీ బాబురాబు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా పరిషత్ నిధులు రూ. 2 లక్షల వ్యయంతో పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెసరు వెంక టమ్మ, గొలేటి సర్పంచ్ తొట లక్ష్మణ్ , సింగల్ విండో డైరెక్టర్ మదునయ్య, టీఆర్ఎస్ నాయకులు పల్లె రాజేశ్వర్రావు, తిరుపతి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment