కార్యరక్షత ను అబినందించిన జిల్లా అధికారులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 15 (వుదయం ప్రతినిధి); కుమ్రంభీమ్ జిల్లా లో 4 వ తెలంగాణా రాష్ట్ర అవతరణ వేడుకలను వైభవముగా ,ఎలాంటి అవాంతరాలు ను కలుగనియకుండా పటిష్టం గా సమర్ధ వంతం గా నిర్వహించినందుకు గాను గురువారం స్థానిక పాలనాఅదికారి కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారి సన్ ప్రీత్ సింగ్ మరియు జిల్లా పాలనా అదికారి చంపాలాల్ గార్లు కాగజ్ నగర్ డిఎస్పి హబీబ్ ఖాన్ ను మరియు ఆసిఫాబాద్ టౌన్ సి.ఐ సతీష్ గారిని ప్రశంస పత్రం తో సన్మానించి ,విధి నిర్వహణ లొ అంకిత బావం తొ పని చేసి జిల్లా కు పోలీసుశాఖ కు మున్ముందు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమములో,ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు ,ఎస్బి ఎసై లు శివకుమార్ ,శ్యాం సుందర్, ఎస్పి సీసీ శ్రీనివాసు ,మరియు కలెక్టర్రేట్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment