Tuesday, 20 June 2017

వారసత్వ ఉద్యోగాల సాధనకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ; ఆత్రం సక్కు

వారసత్వ ఉద్యోగాల సాధనకు  కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ;  ఆత్రం సక్కు

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 20  (వుదయం ప్రతినిధి);  సింగరేణిలో  వారసత్వ ఉద్యోగాల సాధన కోసం జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన నిరవధిక సమ్మెకు  కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పూర్తి మద్దతును ప్రకటిస్తూన్నామని టిపీసీసీ కార్యదర్శి ఆత్రం సక్కు,డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ అన్నారు.మంగళవారం రోజున రెబ్బెన మండలం  గోలేటి టౌన్ షిప్ లోని కేఎల్ మహేంద్ర భవన్ జాతీయ సంఘాల జేఏసీ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి  హాజరయ్యి వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సింగరేణి కార్మికులను మభ్యపెడుతున్నారని అన్నారు.సింగరేణిలోనే కాకుండా తెలంగాణ స్వరాష్ట్రంలో అవినీతి,అక్రమాలు పెరిగాయని,తెరాస పాలకులు భూ దందాలు, పోటీ పరీక్షలలో పైరవీలకు ముఖ్యమంత్రి వత్తాసు పలుకుతున్నారని ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నిచారు.టిబిజికెఎస్ వారసత్వ  ఉద్యోగాలను కల్పించకపోవడమే కాకుండా,వారసత్వాల కోసం జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెను విచ్చిన్నం చేసి మారో సారి కార్మికులను మోసం చేసిందని దుయ్యబట్టారు.దీనిని కార్మికులు గుర్తుపెట్టుకొని టిబిజికెఎస్ కు బుద్ధి చెప్పాలని అన్నారు.అవగాహనా లోపం,కార్మిక చట్టాలుం తెలియని ప్రాంతీయ సంఘాలను సింగరేణిలో పాతరవేయాలని అన్నారు.కార్మికులు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెలో స్వచ్చందoగా సమ్మెలో పాల్గొనాలని కార్మికులను వారు కోరారు.అనంతరం జనరల్ మేనేజర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించిన సక్కు,విశ్వప్రసాద్,ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి,ఐఎన్టియూసీ నాయకులూ ముచ్చర్ల మల్లయ్యలను పోలీసులు అడ్డుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ,సిపిఐ,కాంగ్రెస్ నాయకులూ జూపాక రాజేష్,సత్యనారాయణ,బిక్షుమయ్య,నంబాల ఎంపీటీసీ సభ్యులు కొవ్వూరి శ్రీనివాస్,ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్,గాజుల రవీందర్,ముంజం రవీందర్,చంద్రశేఖర్,ఉపేందర్,రవీందర్,పూదరి సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment