కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 20 (వుదయం ప్రతినిధి); జాతీయ కార్మిక సంఘాలు వారసత్వ ఉద్యాగాలు పిలుపుమేరకు చేపట్టిన సమ్మెలో కార్మికులు విధులను నిర్వహించి బొగ్గు ఉత్పత్తిని సాధించారని బెల్లంపల్లి ఏరియా జి యం. కె రవిశంకర్ అన్నారు. మంగళవారం రెబ్బన మండలలోని గోలేటి జీఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వారసత్వ ఉద్యోగులపై గత 5 రోజులుగా జరుగుతున్నా కార్మికుల నిరవధిక సమ్మె ప్రభావం రోజురోజుకు హాజరు శాతం పెరిగింది అని తలిపారు. బొగ్గు ఉత్పత్తిలో 11శాతం సాధించిందని, బొగ్గు రవాణాలో 7శాతం ఏరియాలోని కార్మికులు ఎలాంటి ఆటంకం లేకుండా విధులకు హాజరు అయ్యారు అని తెలిపారు. బెల్లంపెల్లి ఏరియాలోని గనులలో కార్మికులు విధులకు హాజరై నిర్దేశించిన లక్షాన్ని సాదించారని తెలిపారు. మిగితా కార్మికులు కూడా విధులలో హాజరై తమ జితబథ్యాలు నష్ట పోకుండా సంస్థ అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ సమావేశం లో ఎస్ ఓ టు జిఎం కొండయ్య డీ జి ఎం పర్సనల్ జె చిత్తరంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment