యధావిధిగా కార్మికులు విధుల్లోకి హాజరు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 16 (వుదయం ప్రతినిధి); జాతీయ సంఘాల పిలుపు మేరకు కార్మికులు చేపట్టిన సమ్మె రెండోరోజున బెల్లంపల్లి ఏరియాలోని కార్మికులు ఎలాంటి ఆటంకం లేకుండా విధులకు హాజరు అయ్యారు అని డి జి ఎం పార్సెనల్ చిత్తరంజన్ కుమార్ తెలిపారు. బెల్లంపెల్లి ఏరియాలోని గనులలో కార్మికులు విధులకు హాజరై నిర్దేశించిన లక్షాన్ని 96 శాతంతో 18.122 టన్నుల ఉత్పత్తి సాదించారని తెలిపారు. మిగితా కార్మికులు కూడా విధులలో హాజరై తమ జితబథ్యాలు నష్ట పోకుండా సంస్థ అభివృద్ధికి సహకరించాలన్నారు. శుక్ర మరియు శనివారము విధులు నిర్వహించిన ఉద్యగులకు ఆదివారము నాడు కూడ హాజరు వెయ్యడం కూడా జరుగుతుందని తెలిపారు.
No comments:
Post a Comment