కార్మిక సంఘాలకు సహకరించిన వ్యాపార, వాణిజ్య సంస్థలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 17 (వుదయం ప్రతినిధి); సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని గత మూడు రోజులుగా జాతీయ కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈరోజు కార్మిక సంఘాల,రాజకీయ పార్టీల పిలుపు మేరకు గోలేటిలో వ్యాపార, వాణిజ్య సంస్థల బంద్ విజయవంతం అయిందని సిపిఐ గోలేటి పట్టణ కార్యదర్శి జగ్గయ్య, ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ లు తెలియజేశారు, బంద్ కు సహకరించిన వ్యాపార, వాణిజ్య సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వారసత్వ ఉద్యోగాల సాధనకు జాతీయ కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనలకు సిపిఐ పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు
No comments:
Post a Comment