కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 23 (వుదయం ప్రతినిధి); మైనార్టీ పేద కుటుంబాలకు రెబ్బనలో శుక్రవారం ఎం పి పి సంజీవ్ కుమార్, ఎం పిడిఓ సత్యనారాయణ సింగ్ తహసీల్దార్ రమేష్ గౌడ్ శుక్రవారం ఉచిత దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మైనార్టీ పేద కుటుంబముల కోసం తెలంగాణ ప్రభుత్వం షాదీ ముబారక్ కార్యక్రమాలు కుల మతలకు అతిహితముగా ఏర్పాటు చేస్తూ మరెన్నో కార్యక్రమాలు చేపడుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ వైస్ మార్కెట్ చెర్మన్ కుందారపు శంకరమ్మ, వైయస్ ఎమ్ పి పి గుడిసెల రేణుక, సర్పంచ్ పెసరి వెంకటమ్మ, ఉప సర్పంచ్ శ్రీధర్ కుమార్ ,మండల కో అప్షన్ సభ్యుడు జాకీర్ హుస్మాని,జామ మసీద్ కమిటీ అధ్యక్షుడు అజీజ్ ,టి ఆర్ ఎస్ మైనార్టీ మండల అధ్యక్షుడు చోటు , సింగిల్ విండో డైరెక్టర్ మధునయ్య,టి ఆర్ ఎస్ నాయకులు నవీన్ కుమార్ జైస్వాల్, సుదర్శన్ గౌడ్, చెన్న సోమశేఖర్ ,వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment