పర్యావరణంతో మనుగడ ; జీఎం రవిశంకర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 30 (వుదయం ప్రతినిధి); పర్యావరణముతోనే మనిషికి మనుగడ ఉంటుందని , ప్రకృతిలో మమేకమై ప్రతిఒక్కరు మొక్కలు నాటాలని జీఎం రవిశంకర్ అన్నారు ప్రపంచ పర్యావరణ వారోత్సవాల సందర్బంగా శుక్రవారం బెల్లం పెళ్లి ఏరియా గోలేటి లోని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా నిర్వహించిన వివిధ ప్రతిభ పోటీలలో విద్యార్థుల కు బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్బంగా జీఎం రవిశంకర్ మాట్లాడుతూ ప్రకృతిలోని జీవ జాతులన్నీ మానవ జాతి తప్ప ప్రకృతికి విగతం కలగకుండా ప్రకృతికి సానుకూలంగా జీవనం సాగిస్తున్నాయని కానీ మానవజాతి వింత చర్యలు వింత పోకడలతో పర్యావరణాన్ని కలుషితం చేస్తూ ప్రకృతి విఘాతం కల్పిస్తున్నాయని తెలిపారు. మనమందరం ప్రకృతి లో మమేకం ఐ మొక్కలు నాటాలన్నారు . ఇక నుంచి సర్వ మానవ జాతి ప్ర కృతి మరియు పర్యావరణ విలువలను గుర్తించి ప్రకృతికి అనుకూలంగా జీవనం కొనసాగించాలని అన్నారు ఈ కార్యక్రమం లో సదాశివ్. తిరుపతి. కే కొండయ్య. శ్రీరామ శాస్రి . కృష్ణ చారి . ఎన్ వెంకటేశ్వర్ రావ్ . తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment